- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
అమీర్పేట, న్యూస్టుడే: పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ అయిన ఈ కేసు ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్కు బదిలీ కావడంతో కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన యువతి(27)... వివాహం చేసుకోవడానికి యాప్లో శోధిస్తుండగా.. ఎస్సార్నగర్ ఠాణా పరిధిలోని జయప్రకాష్నగర్లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న ముత్తుమ్ముల రాజశేఖర్(30) పరిచయమయ్యాడు. తాను ఫొటోగ్రాఫర్నని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. యువతికి చెందిన ఈ-మెయిల్ ఐడీని కూడా వినియోగించేవాడు. గత నెల 24న యువతికి ఫోన్ చేసిన రాజశేఖర్ తన ఫోటో స్టూడియోకు రమ్మని పిలిచాడు. మరుసటి రోజు స్టూడియోకు వెళ్లిన యువతిని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే మెయిల్ ద్వారా లభ్యమైన నీ ఫొటోలను అందరికీ పంపి పరువు తీస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని హెచ్చరించాడు. బాధితురాలు అక్కడి నుంచి బయటపడి సమీప బంధువైన మహిళకు విషయం చెప్పింది. వారు ఉప్పల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి జీరో ఎఫ్ఐఆర్ ఎస్సార్నగర్కు బదిలీ కావడంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రైలు ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం.. ఘట్కేసర్ వద్ద ఘటన
ఘట్కేసర్: పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బీబీనగర్-ఘట్కేసర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా యువకులు ఐదుగురి దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. -
నీపై దయ చూపడమా?: కోర్టు వ్యాఖ్య
కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగికదాడి మొదలుపెట్టాడు. -
పాపం.. విలవిల్లాడిన పసికూనలు
స్కూల్ బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివారులో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. -
జిగానా తుపాకులు.. రూ.25 లక్షల సుపారీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. -
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
బీరు కోసం గొడవపడి బర్త్డే బాయ్ని ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగో అంతస్తు నుంచి తోసేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఖాతాదారు డబ్బు మాయం... యూనియన్ బ్యాంకుకు జరిమానా
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
-
వందేళ్ల తాతా.. వహ్వా నీ ఘనత: మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్
-
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
-
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య