- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు.
వివరాలు వెల్లడిస్తున్న సీఐ హరినాథ్
కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్టుడే: వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. ఆ గ్రామ సమీపంలో చెలిగెద్దులకొండ వద్ద అదే గ్రామానికి చెందిన వన్నూరస్వామిని గొంతు కోసి హత్య చేసిన ఘటనకు సంబంధించి 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. వన్నూరుస్వామి అక్క కుమారుడైన నిందితుడిది గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామం కాగా చిన్నప్పటి నుంచి కురాకులతోటలోని మామ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో మృతుడి భార్యతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ విషయమై వారు పలుమార్లు గొడవ పడ్డారు. అడ్డుగా ఉన్న వన్నూరస్వామిని అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ఈనెల 28న గ్రామ సమీపంలో కొండ వద్ద ఇద్దరూ మద్యం తాగారు. ఆ సమయంలో నిందితుడు తన వెంట తెచ్చుకొన్న కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. కుందుర్పి, కంబదూరు ఎస్ఐలు వెంకటస్వామి, ఆంజనేయులు, కానిస్టేబుళ్లు ఖాజామోహిద్దీన్, పుష్పరాజ్, రాయుడు, వంశీకృష్ణ, షఫీ, గంగాధర ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించి నిందితుడిని పట్టణ సమీపంలో మారుతి వేబ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. విచారించగా కక్షసాధింపుతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా యువకులు ఐదుగురి దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. -
నీపై దయ చూపడమా?: కోర్టు వ్యాఖ్య
కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగికదాడి మొదలుపెట్టాడు. -
పాపం.. విలవిల్లాడిన పసికూనలు
స్కూల్ బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివారులో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. -
జిగానా తుపాకులు.. రూ.25 లక్షల సుపారీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. -
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
బీరు కోసం గొడవపడి బర్త్డే బాయ్ని ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగో అంతస్తు నుంచి తోసేశారు.