- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
బావిలోపడి తల్లీకుమార్తెల మృతి
అత్తారింటి వేధింపులతో ఘటన?
ఘటనపై గ్రామస్థుల అనుమానాలు
తల్లీ కుమార్తెల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సోమల, న్యూస్టుడే: సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అనేక అనుమానాలుండగా.. విషయం తెలిసి గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.. ఆవులపల్లె పంచాయతీ పట్రపల్లె రోడ్డులో కాపురం ఉంటున్న సుబ్రహ్మణ్యం కుమార్తె రాణెమ్మకు పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన విజయకుమార్తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి హేమశ్రీ, జస్విక కుమార్తెలు. ఆవులపల్లెలో జరిగే గంగ జాతరలో పాల్గొనడానికి శనివారం రాణెమ్మ పిల్లలతో పుట్టింటికి వచ్చారు. ఆదివారం ఉదయాన్నే పట్రపల్లెలోని పొలం వద్దకు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లారు. అక్కడ బావిలోంచి శబ్దం రావడంతో పరిసర ప్రాంత రైతులు వెంటనే స్పందించారు. అందులోకి దూకి.. రాణెమ్మ (22), హేమశ్రీ (5), జస్విక (18 నెలలు)ను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు చనిపోవడంతో మృతదేహాలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకట నరసింహులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీఆర్వో రమణ, స్థానికుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి మృతదేహాలను పుంగనూరు ఆసుపత్రికి తరలించారు. బావి సమీపంలో ఆడుకొంటున్న తన మనవరాళ్లు ప్రమాదవశాత్తు అందులో పడిపోగా వారిని కాపాడేందుకు వెళ్లిన కుమార్తె సహా ముగ్గురూ మృతిచెందినట్లు తండ్రి సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఘటనపై గ్రామస్థులు మరోవైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్తింటివారి వేధింపులతోనే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా యువకులు ఐదుగురి దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. -
నీపై దయ చూపడమా?: కోర్టు వ్యాఖ్య
కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగికదాడి మొదలుపెట్టాడు. -
పాపం.. విలవిల్లాడిన పసికూనలు
స్కూల్ బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివారులో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. -
జిగానా తుపాకులు.. రూ.25 లక్షల సుపారీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. -
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
బీరు కోసం గొడవపడి బర్త్డే బాయ్ని ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగో అంతస్తు నుంచి తోసేశారు.