- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కస్టమ్స్లో ఇంటి దొంగలు
శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో ఇంటి దొంగల బాగోతం బహిర్గతమైంది. విదేశీ కరెన్సీని అక్రమంగా మార్పిడి చేసినందుకు ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఓ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్ సీబీఐ కేసు నమోదు చేసింది.
విదేశీ కరెన్సీని మారుస్తుండగా పట్టివేత
ముగ్గురిపై సీబీఐ కేసు నమోదు
ఈనాడు, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో ఇంటి దొంగల బాగోతం బహిర్గతమైంది. విదేశీ కరెన్సీని అక్రమంగా మార్పిడి చేసినందుకు ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఓ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్ సీబీఐ కేసు నమోదు చేసింది. విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో ఓంప్రకాశ్ దత్తా ఆఫీస్బాయ్గా.. సంజయ్పాల్ లోడర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ 2023 మార్చి 16న అరైవల్ సర్వీస్రోడ్డులో ఉన్న కారు వద్దకు వెళ్లారు. కారులో ఉన్న మరో ఇద్దరికి వీరు విదేశీ కరెన్సీ ఇస్తున్నట్లు గుర్తించిన సీఐఎస్ఎఫ్లోని క్రైమ్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తులను బహదూర్పురాకు చెందిన గులామ్అలీ (34), సాజిద్ (34)గా గుర్తించారు. వారివద్ద విదేశీ, మన కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఓంప్రకాశ్ను విచారించడంతో విదేశీ కరెన్సీని తనకు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసులు, పేరి చక్రపాణి, ఇన్స్పెక్టర్ పంకజ్గౌతమ్ ఇచ్చినట్లు అంగీకరించాడు. సంజయ్పాల్తో కలిసి వెళ్లి వాటిని గులాంఅలీ, సాజిద్ వద్ద మార్చుకురావాలని పంపినట్లు వెల్లడించాడు. కరెన్సీ స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు దాన్ని కస్టమ్స్ ఉన్నతాధికారులకు అప్పగించారు. దీనిపై ఆర్జీఐఏ కస్టమ్స్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ అలేఖ్య బల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్తర్ ఫైటర్ను హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా నెలంగూర్ గ్రామానికి చెందిన సన్ను ఉసెండి(30) అనే బస్తర్ ఫైటర్ను మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. -
ఇంటి పైకప్పు కూలి.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
మట్టి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. -
మందుగోలీల మధ్య సిమ్కార్డులు
ఒక్క సిమ్కార్డును ఉపయోగించి వేయి మందిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లకు వేల నంబర్లు చిక్కితే... వారి ఆగడాలకు ఇక అంతే ఉండదు. ఇప్పుడదే జరుగుతోంది. విదేశీ సైబర్ ముఠాలు ఇక్కడి యువతకు కాసుల ఎరవేసి... -
కొత్త చట్టంతో చార్మినార్లో తొలి కేసు
దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలో తొలిసారిగా చార్మినార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చారు. -
రాధాకిషన్రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయి చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. -
అనుమానంతో హతమార్చాడు
తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం పెంచుకుని.. ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన అమానవీయ ఘటన ఇది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. -
పొలాన్ని ధ్వంసం చేశారని రైతు బలవన్మరణం
గ్రామానికి చెందిన పలువురు కక్ష కట్టి తన భూమిని యంత్రాలతో ధ్వంసం చేశారనే ఆవేదనతో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో సోమవారం బోజడ్ల ప్రభాకర్ (42) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. -
మా భూమిని కబ్జా చేశారు..!
తమ పేరిట ఉన్న భూమిని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడికెళ్లినా న్యాయం జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించారు. -
మోసం చేశాడని ప్రియుడి మర్మాంగం కోసిన వైద్యురాలు
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణతో ప్రియుడి మర్మాంగం కోసేసింది ఓ వైద్యురాలు. ఈ ఘటన బిహార్లోని సారణ్ జిల్లా మధురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. -
రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్య
రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం.. -
ఎస్పీ కార్యాలయంలోనే భార్యను పొడిచి చంపిన కానిస్టేబుల్
తనపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భార్యను కానిస్టేబుల్ అయిన ఆమె భర్త అక్కడికక్కడే హత్య చేశాడు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన లారీ దూసుకెళ్లి రహదారి పక్కనున్న ఇంటిని ధ్వంసం చేసింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పంచాయతీ పరాకువాండ్లపల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
చిన్నారి తలలో పెన్ను దిగబడి..
భద్రాచలం పట్టణం సుభాశ్నగర్ కాలనీకి చెందిన రియాన్షిక అనే అయిదేళ్ల చిన్నారికి తలలో పెన్ను దిగబడటంతో పరిస్థితి విషమంగా మారింది. -
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.