- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రూ.4.37 కోట్ల పరిహారం పక్క‘దారి’
కుమురంభీం జిల్లాలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో రూ.4.37 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో అనిశా(ఏసీబీ) అధికారులు శనివారం అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుత వరంగల్ ఆర్డీఓ), ఆసిఫాబాద్ డిప్యూటీ తహసీల్దార్ మెస్రం నాగోరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అదుపులోకి తీసుకున్నారు.
లేఅవుట్లలోని రోడ్లకు మంజూరైన సొమ్ము.. స్థిరాస్తి వ్యాపారుల ఖాతాల్లోకి
ఆర్డీఓ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న అనిశా
ఈనాడు, ఆసిఫాబాద్: కుమురంభీం జిల్లాలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో రూ.4.37 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో అనిశా(ఏసీబీ) అధికారులు శనివారం అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుత వరంగల్ ఆర్డీఓ), ఆసిఫాబాద్ డిప్యూటీ తహసీల్దార్ మెస్రం నాగోరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని కరీంనగర్ అనిశా కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారంపై అనిశా అధికారులు మే 1న కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విచారణ కొలిక్కిరాలేదు. ఎన్నికల కోడ్ ముగిశాక తాజాగా విచారణ వేగం పుంజుకుంది.
ఇదీ జరిగింది..
కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ పట్టణాన్ని ఆనుకుని ఉండే జన్కాపూర్ శివారు ప్రాంతంలోని సర్వే నంబర్లు 9, 10లలో సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లు 1992లో 15 ఎకరాల్లో జాయింట్ వెంచర్ వేసి, ప్లాట్లు విక్రయించారు. అమ్మిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు సైతం జరిగాయి. ఈ లేఅవుట్ల గుండా జాతీయ రహదారి 363 నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఈ లేఅవుట్లలోని 6 ఎకరాల 12 గుంటలను సేకరించినట్లు రెవెన్యూ అధికారులు చూపారు. వాటికి రూ.4.32 కోట్ల పరిహారం మంజూరైంది. వెంచర్లలో రహదారుల కోసం వదిలిన స్థలాలకు సైతం మంజూరైన పరిహారాన్ని పంచాయతీకి ఇవ్వాల్సి ఉండగా.. శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లు అక్రమంగా తీసుకున్నారు. ధరణిలో పట్టాదారులుగా వీరిద్దరి పేర్లు ఉండటంతో పరిహారాన్ని పక్కదారి పట్టించినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. మరోవైపు, ప్లాట్లు కొన్నవారికి సైతం పరిహారం వచ్చింది.
సహకరించిన రెవెన్యూ అధికారులు..
స్థిరాస్తి వ్యాపారులకు అయాచితంగా పరిహారం డబ్బులు వచ్చేలా 2019లో పనిచేసిన రెవెన్యూ అధికారులు సహకరించారు. ఇందుకు ప్రతిఫలంగా లక్ష్మీనారాయణగౌడ్ బ్యాంకు ఖాతా నుంచి సుబ్బ శంభుదాస్ వద్ద అప్పట్లో డ్రైవర్గా పనిచేసిన తిరుపతి బ్యాంకు ఖాతాకు రూ.1,15,19,000 వరకు జమ అయ్యాయి. వాటిని ఆయన ఆర్డీఓ సిడాం దత్తు తల్లి సిడాం మల్కుబాయి ఖాతాలో రూ.65 లక్షలు, డిప్యూటీ తహసీల్దార్ మేస్రం నాగోరావు సోదరుడు మేస్రం చత్రుషా ఖాతాలో రూ.30 లక్షలు జమ చేశారు. సర్వేయర్ భరత్కు రూ.10 లక్షల నగదు ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల విలువైన ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి ఇచ్చారని అధికారులు గుర్తించారు. నిందితుల బ్యాంకు స్టేట్మెంట్లు, డ్రైవర్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని కరీంనగర్ అనిశా డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
మా భూమిని కబ్జా చేశారు..!
తమ పేరిట ఉన్న భూమిని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడికెళ్లినా న్యాయం జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించారు. -
అనుమానంతో హతమార్చాడు
తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం పెంచుకుని.. ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన అమానవీయ ఘటన ఇది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. -
ఇంటి పైకప్పు కూలి.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
మట్టి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. -
బస్తర్ ఫైటర్ను హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా నెలంగూర్ గ్రామానికి చెందిన సన్ను ఉసెండి(30) అనే బస్తర్ ఫైటర్ను మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. -
మందుగోలీల మధ్య సిమ్కార్డులు
ఒక్క సిమ్కార్డును ఉపయోగించి వేయి మందిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లకు వేల నంబర్లు చిక్కితే... వారి ఆగడాలకు ఇక అంతే ఉండదు. ఇప్పుడదే జరుగుతోంది. విదేశీ సైబర్ ముఠాలు ఇక్కడి యువతకు కాసుల ఎరవేసి... -
కొత్త చట్టంతో చార్మినార్లో తొలి కేసు
దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలో తొలిసారిగా చార్మినార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చారు. -
రాధాకిషన్రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయి చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. -
పొలాన్ని ధ్వంసం చేశారని రైతు బలవన్మరణం
గ్రామానికి చెందిన పలువురు కక్ష కట్టి తన భూమిని యంత్రాలతో ధ్వంసం చేశారనే ఆవేదనతో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో సోమవారం బోజడ్ల ప్రభాకర్ (42) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. -
మోసం చేశాడని ప్రియుడి మర్మాంగం కోసిన వైద్యురాలు
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణతో ప్రియుడి మర్మాంగం కోసేసింది ఓ వైద్యురాలు. ఈ ఘటన బిహార్లోని సారణ్ జిల్లా మధురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. -
రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్య
రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం.. -
ఎస్పీ కార్యాలయంలోనే భార్యను పొడిచి చంపిన కానిస్టేబుల్
తనపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భార్యను కానిస్టేబుల్ అయిన ఆమె భర్త అక్కడికక్కడే హత్య చేశాడు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన లారీ దూసుకెళ్లి రహదారి పక్కనున్న ఇంటిని ధ్వంసం చేసింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పంచాయతీ పరాకువాండ్లపల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
చిన్నారి తలలో పెన్ను దిగబడి..
భద్రాచలం పట్టణం సుభాశ్నగర్ కాలనీకి చెందిన రియాన్షిక అనే అయిదేళ్ల చిన్నారికి తలలో పెన్ను దిగబడటంతో పరిస్థితి విషమంగా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం