- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హావేరి, న్యూస్టుడే: కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బ్యాడగి తాలూకా గుండేనహళ్లి సమీపంలో బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ఈ ప్రమాదం సంభవించింది. పొగమంచు దట్టంగా అలముకుని ఉండడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గమనించకుండా.. ప్రయాణికుల వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామానికి చెందినవారే. వీరంతా సమీప బంధువులు. వీరంతా టెంపో ట్రావెలర్లో శివమొగ్గ నుంచి మహారాష్ట్రలోని తివారీ లక్ష్మీ దేవాలయానికి వెళ్లారు. వాహనానికి పూజ చేయించి, తుల్జా భవాని దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి కలబురగి జిల్లా చించోళి మాయమ్మ ఆలయం, బెళగావి జిల్లా సవదత్తి రేణుకా యల్లమ్మను దర్శించుకున్నారు. గురువారం రాత్రి సవదత్తి నుంచి తిరుగు పయనం ప్రారంభించి.. సొంత ఊరికి చేరుకోవడానికి కొద్ది సమయం ముందు ఈ ప్రమాదానికి గురయ్యారు.
అంధుల ఫుట్బాల్ జట్టు కెప్టెన్ కూడా..
భారత అంధుల ఫుట్బాల్ జట్టు సభ్యురాలైన మానస.. ఈ ప్రమాదంలోనే విగతజీవిగా మారారు. శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకుంటామని మానస గురువారం రాత్రి ఫోన్ చేసి చెప్పిందంటూ ఆమె సోదరి మహాలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ఆమెకు రెండు కళ్లూ కనిపించకపోవడంతో ఇటీవలే శస్త్రచికిత్స చేయించామని గుర్తు చేసుకున్నారు. మృతులలో ఒకరైన మానస భారత అంధుల ఫుట్బాల్ మహిళా జట్టు కెప్టెన్. అంధత్వాన్ని అవరోధంగా భావించకుండా ఆమె ఇటీవలే ఎమ్మెస్సీ పూర్తిచేశారు. సివిల్స్ సాధించే లక్ష్యంతో బెంగళూరులో ఉండి చదువుకుంటూ.. విరామం లభించడంతో సొంత ఊరికి ఆదివారమే వెళ్లి.. బంధువులతో పాటు ఆలయాల సందర్శనకు బయల్దేరి ఇలా ప్రమాదంలో చిక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.