- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మద్యం మాయం కేసులో బగ్గా అరెస్ట్
డిస్టిలరీ నుంచి మద్యం మాయం కేసులో బగ్గా డిస్టిలరీ డైరెక్టర్ జస్మిత్సింగ్ బగ్గాను శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు అరెస్టుచేశారు.
ఈనాడు, హైదరాబాద్: డిస్టిలరీ నుంచి మద్యం మాయం కేసులో బగ్గా డిస్టిలరీ డైరెక్టర్ జస్మిత్సింగ్ బగ్గాను శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు అరెస్టుచేశారు. అతడితో పాటు డిస్టిలరీ ప్రొడక్షన్ ఇన్ఛార్జి పాశం లింగారెడ్డి, గోదాం ఇన్ఛార్జి మామిండ్ల అశోక్, స్కానింగ్ ఇన్ఛార్జి వెంకటేశ్లనూ అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీచేశారు. అనంతరం రూ.15వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని పంపించారు. ఇదే కేసులో ఇప్పటికే డిస్టిలరీ జనరల్ మేనేజర్ బి.రమేశ్ను ఈనెల 20న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం స్పాట్ బెయిల్ పొంది విడుదలయ్యాడు. శంషాబాద్ మండలం సాతంరాయిలోని బగ్గా డిస్టిలరీలో 100 కార్టన్ల డౌన్టౌన్ విస్కీ బాటిళ్లు మాయమైన ఉదంతంలో వీరిపై కేసు నమోదైంది. ఒక్కో కార్టన్లో 48 బాటిళ్ల చొప్పున ఉన్న ఆ మద్యం విలువ రూ.5.60 లక్షలుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సంస్థ జీఎం రమేశ్ను అరెస్ట్ చేసి మరుసటి రోజు న్యాయస్థానంలో హాజరుపరిచారు. దర్యాప్తు క్రమంలో బగ్గా మార్గదర్శకత్వంలోనే ఈ తతంగం నడిచినట్లు వెల్లడి కావడంతో తాజాగా బగ్గాతోపాటు ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ
-
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
-
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
-
విద్యార్థుల ఆస్ట్రేలియా కల మరింత భారం..!
-
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
-
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు