- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
విద్యుదాఘాతంతో నలుగురి మృతి
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం విద్యుదాఘాతానికి గురై నలుగురు మృత్యువాత పడ్డారు.
పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో ఘటనలు
తాడేపల్లిగూడెం అర్బన్, ఆగిరిపల్లి, న్యూస్టుడే: పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం విద్యుదాఘాతానికి గురై నలుగురు మృత్యువాత పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన గట్టిం వెంకన్న (60) భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ (55)తో కలసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అన్నపూర్ణ మోటారు స్విచ్ వేసే క్రమంలో విద్యుత్ వైర్లు తాకడంతో గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో వెంకన్న కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇద్దరు అక్కడకక్కడే మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా.. వారికి వివాహాలయ్యాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.పది వేల ఆర్థికసాయం అందజేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదరకు చెందిన దొండపాటి నాగరత్నం (63) ఇంటి వద్ద దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకారు. ఆమె కుమారుడు దొండపాటి రామదాసు (42) తల్లిని రక్షించే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నాగరత్నంకు భర్త, రామదాసుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ