- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కూతురిపై అసభ్య ప్రవర్తన
తాగిన మైకంలో కన్న కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించబోయిన భర్తను.. భార్య గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చింది.
భర్తను నరికి చంపిన భార్య
జోగిపేట న్యూస్టుడే: తాగిన మైకంలో కన్న కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించబోయిన భర్తను.. భార్య గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చింది. బుధవారం అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పుల్కల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. సుల్తాన్పూర్కు చెందిన మన్నె మాణయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె సుకన్యకు పెళ్లి చేయగా ఆమెకు పాప జన్మించింది. భర్తతో విభేదాల కారణంతో ఆమె రెండేళ్లుగా తల్లిగారింట్లోనే ఉంటోంది. కుమారుడు ప్రవీణ్కుమార్కు వివాహమైంది. భార్యతో గొడవల కారణంతో ఆయన ఏడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి మాణయ్య ఇంట్లో భార్య ఇందిరమ్మ, కూతుళ్లు, మనవరాలితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా మాణయ్య మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్య, కూతుళ్లను దూషించేవాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో భార్య, కూతుళ్లను దుర్భాషలాడుతూ.. అక్కడే ఉన్న గడ్డపార, గొడ్డలితో తలుపులు విరగ్గొట్టే ప్రయత్నం చేశాడు. తల్లీకూతుళ్లు బయటకు వచ్చి మాణయ్య వద్ద ఉన్న గొడ్డలి, గడ్డపారను లాక్కున్నారు. దీంతో ఆగ్రహించిన మాణయ్య కుమార్తె సుకన్యపై అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. కోపోద్రిక్తురాలైన ఇందిరమ్మ తన వద్ద ఉన్న గొడ్డలితో భర్తను మెడపై నరికింది. తీవ్రంగా గాయపడిన మాణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్కుమార్, పుల్కల్ ఎస్సై శ్రీకాంత్ అదే రాత్రి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించారు. ఇందిరమ్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!
-
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
-
తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున