- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సహజీవనం చేస్తున్న మహిళ పిల్లలపై అత్యాచారం
ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె ముగ్గురు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రాజేంద్రనగర్ పోక్సో కోర్టు గురువారం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
నర్సింహులు
రాజేంద్రనగర్: ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె ముగ్గురు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రాజేంద్రనగర్ పోక్సో కోర్టు గురువారం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చందానగర్ ఠాణా పరిధిలో రెండేళ్ల కిందట జరిగిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రత్యేక ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం నాగులాపురానికి చెందిన నల్లోల నర్సింహులు హైదరాబాద్లో నివసించేవాడు. అప్పటికే వివాహమైన ఓ మహిళ తన భర్తకు అనారోగ్యం ఉండటంతో గాంధీలో చేర్పించి చికిత్స చేయిస్తోంది. ఆమెకు నర్సింహులుతో పరిచయం ఏర్పడింది. అతడితో సహజీవనం చేసింది. ఆ మహిళకు 8, 11 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు, ఐదేళ్ల కుమారుడున్నారు. వీరంతా ఒకే గుడిసెలో నివసించేవారు. ఆమె లేని సమయంలో ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరిపై నర్సింహులు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక ఆరోగ్యం క్షీణించగా పక్కనే నివసించే మరో మహిళ ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. విషయాన్ని తల్లికి చెప్పి 2022 జూన్ 6న చందానగర్ ఠాణాలో ఫిర్యాదు చేయించారు. విచారించిన పోలీసులు సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించారు. ఈ అమానవీయ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఆంజనేయులు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, బాలుడికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. పిల్లల్ని తల్లి వదిలేసి వెళ్లగా, వారు ప్రభుత్వ సంరక్షణహోంలో ఉన్నారు. ఇదిలాఉంటే నిందితుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!
-
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
-
తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున