- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మహిళల దుస్తులు ధరించి విమానాశ్రయ అధికారి ఆత్మహత్య
మహిళల దుస్తులు ధరించిన విమానాశ్రయ అధికారి ఒకరు తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
రుద్రపుర్: మహిళల దుస్తులు ధరించిన విమానాశ్రయ అధికారి ఒకరు తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్సింగ్నగర్ జిల్లా పంత్నగర్లోని విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పితోర్గఢ్ జిల్లాకు చెందిన ఆశిష్ చౌసాలి విమానాశ్రయంలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. సోమవారం ఆయన మహిళల దుస్తులు ధరించి, నుదుటన బొట్టు బిళ్ల పెట్టుకుని, లిప్స్టిక్ వేసుకుని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉధమ్సింగ్నగర్ జిల్లా (నగర) ఎస్పీ మనోజ్ కత్యాల్ మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఘటనను ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని, గదిలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తి దూసిన ప్రేమోన్మాదం
తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు. -
మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి
విజయవాడ అజిత్సింగ్నగర్ లూనా సెంటర్లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. -
బతుకులు ఛిద్రం!
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఆయువు తీసిన అతివేగం
అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది.