- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఏసీబీకి పట్టుబడిన వెల్దండ ఎస్సై
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై రవి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబట్టారు.
వెల్దండ గ్రామీణం, న్యూస్టుడే: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై రవి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబట్టారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్ కథనం ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలోని తిలక్నగర్ చెందిన డేరంగుల వెంకటేశ్ ఇంట్లో ఈనెల 17న రాళ్లు పగులగొట్టేందుకు వినియోగించే మందుగుండు సామగ్రి 7 పెట్టెల జిలిటెన్ స్టిక్స్, 2 పెట్టెల డిటోనేటర్లను నిల్వ చేయగా వెల్దండ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయంలో కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటేశ్ ఈ నెల 19న ఏసీబీని ఆశ్రయించారు. ఎస్సై సూచన మేరకు వెంకటేశ్ కల్వకుర్తి పట్టణానికి చెందిన అంబులెన్సు డ్రైవర్ విక్రమ్కు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో వెల్దండ ఠాణాలో ఎస్సై రవిని అరెస్టు చేశామని అనిశా డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తి దూసిన ప్రేమోన్మాదం
తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు. -
మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి
విజయవాడ అజిత్సింగ్నగర్ లూనా సెంటర్లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. -
బతుకులు ఛిద్రం!
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఆయువు తీసిన అతివేగం
అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
-
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
-
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు తీవ్ర అస్వస్థత
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు