- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బాలుడి ఊపిరి తీసిన చీర ఊయల!
ఊయల ఊగుతున్న పదకొండేళ్ల బాలుడు.. మెలితిరిగిన చీర ఊయల మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. తెలంగాణలోని కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మెలి తిరిగి మెడకు చుట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
చింతలమానెపల్లి, న్యూస్టుడే: ఊయల ఊగుతున్న పదకొండేళ్ల బాలుడు.. మెలితిరిగిన చీర ఊయల మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. తెలంగాణలోని కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన డగే నారాయణ, లక్ష్మి దంపతుల కుమారుడు అంజన్న(11).. ఇంట్లో చీరతో కట్టిన ఊయలపై మంగళవారం ఊగుతూ ఆడుకుంటుండగా.. కుటుంబసభ్యులు ఇంటిబయట చెట్టుకింద ఉన్నారు. వారు వచ్చి చూసేసరికి.. చీర మెలితిరిగి మెడకు చుట్టుకొని బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే అంబులెన్స్ను పిలిపించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే బాలుడు మృతి చెందాడు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసిన అంజన్నను.. ఈ వారంలో పక్క గ్రామమైన కేతినిలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంతో వారు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తి దూసిన ప్రేమోన్మాదం
తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు. -
మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి
విజయవాడ అజిత్సింగ్నగర్ లూనా సెంటర్లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. -
బతుకులు ఛిద్రం!
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఆయువు తీసిన అతివేగం
అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
-
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు