Crime news: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో గంజాయి కలకలం

కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీ లో గంజాయి కలకలం రేగింది. 

Published : 04 Jul 2024 22:11 IST

వేంపల్లె: కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీ లో గంజాయి కలకలం రేగింది. బుధవారం రాత్రి ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి, సిగరెట్లు లోనికి తీసుకెళ్తుండగా ట్రిపుల్‌ ఐటీ మెయిన్ గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. దీనిపై సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం కోర్ కమిటీ సమావేశం నిర్వహించి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏవీఎస్‌ కుమారస్వామి గుప్త విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆర్కేవ్యాలీ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని