Crime news: మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది.

Updated : 29 Jun 2024 20:02 IST

బాపట్ల: బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. నిజాంపట్నం మండలంలో 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక.. శుక్రవారం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆ బాలికను గ్రామ శివారులోని తోటల్లోకి తీసుకెళ్లి దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బాలిక స్వగ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొద్ది రోజుల క్రితం బాలికకు నిందితుల్లో ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఆమెను కలిసేందుకు 28వ తేది రాత్రి వారిద్దరితో పాటు మరో ముగ్గురు వచ్చారు. ఆపై తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంట్లో కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రి 10గంటల తర్వాత ఆమె ఇంటికి రావటంతో మేనమామ ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది. ఈ ఘటనపై బాలిక బంధువులు అడవుల దీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని