- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime news: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది.
బాపట్ల: బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. నిజాంపట్నం మండలంలో 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక.. శుక్రవారం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆ బాలికను గ్రామ శివారులోని తోటల్లోకి తీసుకెళ్లి దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బాలిక స్వగ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొద్ది రోజుల క్రితం బాలికకు నిందితుల్లో ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఆమెను కలిసేందుకు 28వ తేది రాత్రి వారిద్దరితో పాటు మరో ముగ్గురు వచ్చారు. ఆపై తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంట్లో కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రి 10గంటల తర్వాత ఆమె ఇంటికి రావటంతో మేనమామ ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది. ఈ ఘటనపై బాలిక బంధువులు అడవుల దీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాగజ్నగర్లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గజ్జెడలో నలుగురు మహిళలు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. -
ప్రాణం తీసిన ‘రాంగ్ రూట్’.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ వద్ద హైదర్నగర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. -
కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు
ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. -
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్ భాగవత్
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
-
ఈనాడు.నెట్ టాప్ 10 వార్తలు @ 9 PM
-
లెదర్ ఫినిష్తో రియల్మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ వేసుకున్నా..వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..