Maharashtra: బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!

బీరు కోసం గొడవపడి బర్త్‌డే బాయ్‌ని ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగో అంతస్తు నుంచి తోసేశారు. 

Published : 03 Jul 2024 00:06 IST

ఠాణె: ఓ యువకుడి పుట్టినరోజు వేడుకలు విషాదంగా ముగిశాయి. బీరు కోసం స్నేహితుల మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదం బర్త్‌డే బాయ్‌ మృతికి దారి తీసింది. మిత్రులే అతడి పాలిట యమకింకరులయ్యారు. బీరు కోసం గొడవపడి పార్టీకి పిలిచిన స్నేహితుడినే నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లా ఉల్హాస్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఠాణె పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

కార్తీక్‌ అనే 23 ఏళ్ల యువకుడు జూన్‌ 27న తన పుట్టిన రోజు వేడుకల కోసం ముగ్గురు స్నేహితుల్ని ఇంటికి పిలిచాడు. మద్యం విషయంలో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అంతలోనే ముగ్గురూ కలిసి అతడిని కిందికి తోసేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత తప్పించుకున్నప్పటికీ.. మృతుడి తల్లిదండ్రులు చెప్పిన వివరాలతో అతడి స్నేహితులందర్నీ ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నిందితుల్ని ధీరజ్‌ (23), నీలేశ్‌ (23), సాగర్‌ (24) గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం బుధవారం వరకు కస్టడీ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని