- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lonavala: జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: సెలవు రోజు సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. ఓ జలపాతం వద్ద మహిళ, నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర (Maharashtra)లో లోనావాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల వివరాలు వెల్లడించాల్సి ఉంది.
మణిపుర్ సమస్య మోదీ సర్కార్కు పట్టడం లేదు: జైరాం రమేశ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం ఆదివారం లోనావాలాలో డ్యామ్ సమీపంలోని జలపాతం సందర్శనకు వచ్చింది. అంతలోనే ఓ మహిళ (40), ముగ్గురు బాలికలు, ఓ బాలుడు ప్రమాదవశాత్తు అందులో జారిపడిపోయారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి రిజర్వాయర్లో మునిగిపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. మహిళ, ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
-
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ గౌను వేసుకున్నా.. వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం