- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ED: పేద విద్యార్థులకు సేవ పేరుతో దోపిడీ.. కేసు నమోదు చేసిన ఈడీ
విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో సోదాలు జరిపిన ఈడీ.. ఆపరేషన్ మొబిలిటి(ఓమ్)పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది.
హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో సోదాలు జరిపిన ఈడీ.. ఆపరేషన్ మొబిలిటి(ఓమ్)పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. తెలంగాణ సీఐడీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఓమ్ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి రూ.300 కోట్లు సేకరించినట్లు ఈడీ పేర్కొంది.
యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, బ్రెజిల్, ఫిన్లాండ్, ఐర్లాండ్, మలేసియా, రుమేనియా, సింగపూర్, నార్వే సహా పలు దేశాల నుంచి నిధులు సేకరించినట్టు తెలిపింది. తాము నిర్వహిస్తోన్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, అనాథ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని ఈ విరాళాలు సేకరించినట్టు గుర్తించారు. విరాళాలను పక్కదారి పట్టించిన సదరు సంస్థ.. పాఠశాలల్లోని విద్యార్థుల వద్ద రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్టు సీఐడీ అధికారులు గతంలో గుర్తించారు. విరాళాల ద్వారా ఓమ్ సంస్థ తెలంగాణ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లో 11 చోట్ల రెండ్రోజుల పాటు సోదాలు చేసిన ఈడీ అధికారులు.. ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, బినామీ కంపెనీల లావాదేవీల వివరాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి