Arrest: బంజారాహిల్స్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన డీజేలు

బంజారాహిల్స్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు డీజేలను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 28 Jun 2024 21:57 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తూ ఇద్దరు డీజేలు పట్టుబడ్డారు. వీరిని పలు పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తున్న అఖిల్, సన్నీగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన ఈ నిందితుల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలు తీసుకొచ్చి పబ్‌లలో పరిచయమైన వారికి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్‌తో పాటు గంజాయి కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు డ్రగ్స్‌ను ఎవరెవరికి సరఫరా చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని