Chennai: చెన్నై విమానాశ్రయంలో రూ.20 లక్షల నగదు స్వాధీనం

చెన్నై విమానాశ్రయంలో సింగపూర్‌ వెళ్లే ప్రయాణికుల లగేజీని అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు.

Published : 25 May 2024 23:27 IST

వడపళని: చెన్నై విమానాశ్రయంలో సింగపూర్‌ వెళ్లే ప్రయాణికుల లగేజీని అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ.20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో.. ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూరులో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు రూ.10 వేలు ఇస్తానని చెప్పినట్లు సదరు మహిళ తెలిపింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని నిందితురాలిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని