- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chennai: చెన్నై విమానాశ్రయంలో రూ.20 లక్షల నగదు స్వాధీనం
చెన్నై విమానాశ్రయంలో సింగపూర్ వెళ్లే ప్రయాణికుల లగేజీని అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు.
వడపళని: చెన్నై విమానాశ్రయంలో సింగపూర్ వెళ్లే ప్రయాణికుల లగేజీని అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ.20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో.. ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూరులో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు రూ.10 వేలు ఇస్తానని చెప్పినట్లు సదరు మహిళ తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని నిందితురాలిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది. కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు. -
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
ముగ్గుర్ని పొట్టన పెట్టుకున్న గుంత
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. -
పోలీసులకు చిక్కిన పార్థీ ముఠా
నల్గొండ, సంగారెడ్డి జిల్లాలతోపాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థీ ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. -
బావిలోని విష వాయువు పీల్చి 9మంది మృతి
ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బావిలోని విష వాయువు పీల్చి 9 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో తండ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఉస్మానియా వైద్య కళాశాలలో గంజాయి కలకలం
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ఉచ్చులో వైద్య విద్యార్థులు చిక్కారు. ధూల్పేట్లో గంజాయి కొనుగోలు చేసేందుకు వెళ్లి.. టీజీన్యాబ్ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. -
సినీనటుడు రాజ్తరుణ్పై యువతి ఫిర్యాదు
తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్తరుణ్ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.