Visakha Express: విశాఖ ఎక్స్ప్రెస్లో లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి పడి యువతికి గాయాలు
విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది.
మిర్యాలగూడ: విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్కు చేరుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్రూమ్ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్.. ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఈ క్రమంలో ప్రయాణికురాలు రైలు నుంచి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్ కూడా రైలు నుంచి కిందపడ్డాడు.
గాయపడిన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్ఐ పవన్ కుమార్రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మహిళను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్ను మరో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానే లేకపోతే అమ్మను ఎవరు చూస్తారని.. కన్నతల్లిని హత్య చేసి కొడుకు బలవన్మరణం
తాను లేకపోతే కన్నతల్లిని ఎవరూ చూసుకోరేమో అనే ఆలోచనతో ఆమెను కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. అనంతరం ఆమె శవం పక్కనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బూడిదగడ్డ ఏరియాలో శనివారం వెలుగుచూసింది. -
రూ.కోట్లు కొట్టేశాడు.. లక్షతో దొరికేశాడు
విలాసవంతమైన జీవితం గడపాలని ఓ యువకుడు ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.2.20 కోట్ల నగదు కొట్టేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఒక్క పూటలో అతడిని పట్టుకొని, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
భార్యను చూసేందుకని.. బస్సునే అపహరించాడు
పుట్టింట్లో ఉన్న తన భార్యను చూసేందుకని.. మద్యం మత్తులో ఉన్న ఓ లారీ డ్రైవరు ఏకంగా ఆర్టీసీ అద్దెబస్సునే అపహరించిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. -
దిల్లీలో యువతిపై బిల్డర్ దాడి
దేశ రాజధాని దిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకొంది. ఆస్తి విషయంలో ఓ యువతితో వాగ్వాదానికి దిగిన బిల్డర్ ఆమెపై భౌతికదాడి చేశాడు. -
అశ్లీల వీడియోతో కుటుంబంలో కల్లోలం
ఆధునిక సమాజంలో పిల్లలకు అందుబాటులో ఉంటున్న సెల్ఫోన్లు.. తద్వారా అరచేతిలోకి వచ్చిన అశ్లీల వీడియోలు మధ్యప్రదేశ్లో ఓ కుటుంబాన్ని కుదిపేసి, నలుగురు సభ్యులను జైలుపాలు చేశాయి. -
కర్నూలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు నగర పరిధిలోని జగన్నాథగట్టుపైఉన్న ట్రిపుల్ఐటీ(డీఎం)లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం కుడుమ గ్రామానికి చెందిన ఎన్.సాయికార్తీక్ నాయుడు(20) ఇక్కడి కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. -
యువతిని నిర్బంధించి.. అత్యాచారం
యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఉదంతం అనకాపల్లిలో సంచలనం రేకెత్తించింది. -
జమ్ములో లోయలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
కోచింగ్ సెంటర్లోకి వర్షపునీరు.. ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి
సెంట్రల్ దిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో శనివారం సాయంత్రం కురిసిన భారీవర్షానికి వరదనీరు పోటెత్తి ఓ భవనంలోని అడుగుభాగంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లోకి చొచ్చుకుపోయింది. -
ఇరువర్గాల దాడి.. విద్యార్థి మృతి
ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఓ విద్యార్థి మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలు గ్రామానికి చెందిన అల్లూరి స్వరూప, రామ్మూర్తి దంపతుల కుమారుడు విష్ణు(21) పాల్వంచలో డిగ్రీ బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్వీయూ పీఎస్కు చెవిరెడ్డి మోహిత్రెడ్డి తరలింపు
-
పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు: దేవినేని ఉమా
-
ఇంటి ముంగిటకే.. అమెరికా డాక్టరు!
-
భార్యను చూసేందుకని.. బస్సునే అపహరించాడు
-
భారాస ప్రగతి కాళేశ్వరంలో కనిపిస్తోంది: జీవన్రెడ్డి ఎద్దేవా
-
సాఫ్ట్వేర్ హుషార్.. రిక్రియేషన్ క్లబ్లు, క్రీడా వసతులు కల్పిస్తున్న సంస్థలు