Crime News: యూనిఫామ్‌ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య

వైఎస్సార్‌ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్‌ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.

Updated : 03 Jul 2024 09:24 IST

కడప నేరవార్తలు: వైఎస్సార్‌ జిల్లాలో ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్‌ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలుపట్టాలపై ఆయన మృతదేహం లభ్యమైంది. కమలాపురం పోలీసుస్టేషన్‌లో నాగార్జునరెడ్డి ఏఎస్సైగా పని చేస్తున్నారు. రాత్రి విధులు ముగిశాక ఉదయాన్నే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ కౌశల్‌ ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని