- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime news: నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య.. వాహనం వదిలి పరార్
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు.
నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఇజాయత్ అలీ అనే ఇంజినీర్ 20 రోజుల కిందట దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. అతడు శనివారం ఓ నిర్మానుష్య ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అతడి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. -
కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు
ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. -
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
-
నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య
-
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాకూర్ విమర్శలు
-
ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 5PM
-
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేఎస్ శ్రీనివాసరాజు
-
రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి