Crime news: నార్సింగిలో ఇంజినీర్‌ దారుణ హత్య.. వాహనం వదిలి పరార్‌

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

Published : 29 Jun 2024 15:30 IST

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఇజాయత్‌ అలీ అనే ఇంజినీర్‌ 20 రోజుల కిందట దుబాయ్‌ నుంచి ఇండియాకు వచ్చాడు. అతడు శనివారం ఓ నిర్మానుష్య ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అతడి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్‌ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్‌ చేశారు. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని