Accident: ప్రాణం తీసిన ‘రాంగ్ రూట్‌’.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ వద్ద హైదర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 01 Jul 2024 19:18 IST

హైదరాబాద్‌: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ వద్ద హైదర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్‌ రూట్‌లో వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పిమిడి చిన్నారావు (40) అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని