- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime news: విజయవాడలో దారుణం.. మందలించాడనే కోపంతో ప్రియురాలి తండ్రిని చంపేశాడు
విజయవాడ బృందావన్ కాలనీలో హత్య జరగడం కలకలం రేపింది. సింధు భవన్ వద్ద కిరాణా వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు.
కృష్ణలంక: తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించిన వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడో యువకుడు. పథకం ప్రకారం అతడిని కడతేడ్చాడు. ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బృందావన్ కాలనీలోని సింధూభవన్ వీధిలో కంకిపాటి శ్రీరామ్ప్రసాద్ (56) వంశీ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. వీరు విధ్యాధరపురం చెరువు సెంటర్లో నివాసముంటున్నారు. పెద్దకుమార్తె దర్శిని (22) విజయవాడలోని శ్రీపొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు హరిత ద్వారా ఆమెకు గడ్డం శివమణికంఠతో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామని ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. వేర్వేరు కులాలు కావడంతో వారు అంగీకరించలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీరామ్ప్రసాద్ కొందరు వ్యక్తులతో కలిసి శివమణికంఠను మందలించాడు. ప్రేమ వ్యవహారానికి దూరంగా ఉండాలని యువకుడి తల్లి కూడా అతడిని వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన శివమణికంఠ.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న శ్రీరామ్ప్రసాద్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కిందపడిన ఆయనపై పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీరామ్ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు
ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. -
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. -
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
కరీంనగర్ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!
కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. -
మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు
అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. -
‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’
వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. -
సోమలలో విషాదం
సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. -
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.