- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime news: అమ్మాయితో ప్రేమ వివాదం.. బీరు సీసాలతో కొట్టి హత్య
అమ్మాయి విషయంలో గొడవపడి తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు కొందరు విద్యార్థులు.
హైదరాబాద్: అమ్మాయి విషయంలో గొడవపడి తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు కొందరు విద్యార్థులు. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ కేసును ఛేదించిన అల్లాపూర్ పోలీసులు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితులంతా 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి అల్లాపూర్కు చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్(17) యూసఫ్గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ఓ రౌడీషీటర్ కుమారుడు, మరికొంత మందితో అతనికి స్నేహం ఉంది. తనతో బంధుత్వం ఉన్న యువతితో డానీష్ చనువుగా ఉండడాన్ని రౌడీషీటర్ కుమారుడు జీర్ణించుకోలేకపోయాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతితో నువ్వెందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు గొడవపడ్డాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన డానీష్ తిరిగి రాలేదు. మరుసటి రోజు బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో అతని మృతదేహం లభించింది. హత్య కావొచ్చని మృతుడి తల్లిదండ్రులు అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా.. బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టి డానీష్ను అడ్డు తొలగించుకోవాలని రౌడీషీటర్ కుమారుడు మిత్రులతో కలిసి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఫోన్ చేసి డానీష్ను అక్కడికి రప్పించారని పోలీసులు తెలిపారు. అతడు వచ్చాక రౌడీషీటర్ కుమారుడు, అతడి మిత్రులు కలిసి కొంతసేపు గంజాయి తాగి, ముందే సిద్ధంగా ఉంచుకున్న ఖాళీ బీరు సీసాలతో దాడి చేశారు. అప్పటికీ డానీష్ చనిపోకపోవడంతో గొంతుపిసికి ప్రాణాలు తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారని తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలోని చరవాణి సిగ్నల్స్ ఆధారాలతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఐదుగురిని కోర్టులో హాజరుపరిచి.. జువైనల్ హోమ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
జలపాతం సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబంలో అయిదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10మంది అరెస్టు
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్రేప్ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
జాగిలాల సాయంతో పబ్బుల్లో పోలీసుల తనిఖీలు
నగరంలోని పలు పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై కేసు నమోదు
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో చోటు చేసుకుంది. -
రూ.4.37 కోట్ల పరిహారం పక్క‘దారి’
కుమురంభీం జిల్లాలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో రూ.4.37 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో అనిశా(ఏసీబీ) అధికారులు శనివారం అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుత వరంగల్ ఆర్డీఓ), ఆసిఫాబాద్ డిప్యూటీ తహసీల్దార్ మెస్రం నాగోరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం శివారులో బాలికపై అయిదుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు. -
మాయమాటలు చెబుతూ.. హతమార్చుతూ..
మాయమాటలు చెబుతూ.. ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. -
కస్టమ్స్లో ఇంటి దొంగలు
శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో ఇంటి దొంగల బాగోతం బహిర్గతమైంది. విదేశీ కరెన్సీని అక్రమంగా మార్పిడి చేసినందుకు ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఓ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్ సీబీఐ కేసు నమోదు చేసింది. -
ఇంజినీరింగ్ ఆపేసి.. డ్రగ్స్ విక్రేతగా మారి
ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్కు బానిసై.. డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్ తీసుకుంటుండగా మాదాపూర్ పోలీసులు, టీజీ న్యాబ్ సిబ్బంది అతడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ ఎయిమ్స్ తెచ్చిన చిచ్చు.. థరూర్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
-
పిఠాపురంలో పవన్ పర్యటన.. అభిమానుల భారీ ఏర్పాట్లు
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!