- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime News: బాలికపై సామూహిక అత్యాచారం
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం శివారులో బాలికపై అయిదుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు.
అయిదుగురు నిందితులపై పోక్సో కేసు నమోదు
రేపల్లె అర్బన్, నిజాంపట్నం, న్యూస్టుడే: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం శివారులో బాలికపై అయిదుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై పోక్సో కేసు నమోదైంది. రేపల్లె గ్రామీణ సీఐ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ శనివారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన ఓ బాలిక మూడురోజుల క్రితం నిజాంపట్నం మండలం గరువుపాలెంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పెరవలికి చెందిన ఇద్దరు బాలురుతో పాటు వెంకటేశ్, సతీష్, వేణు అనే యువకులు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గరువుపాలెం వెళ్లారు. యువకులతో పాటు వెళ్లిన ఓ బాలుడికి బాలికతో పరిచయం ఉంది. ఆ బాలుడు.. బాలిక అమ్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఫోన్ చేయగా ఆమె బయటకు వచ్చింది. అనంతరం ఇద్దరు బాలురు కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై గరువుపాలెం శివారులోని మామిడితోటలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు యువకులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి పది గంటల సమయంలో బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో కంగారుపడిన అమ్మమ్మ, మేనమామ వెతకడం ప్రారంభించారు. అంతలో గ్రామ శివారు నుంచి ఏడుస్తూ వస్తున్న బాలికను చూసి మేనమామ ఏం జరిగిందని నిలదీయగా అత్యాచారం విషయం చెప్పింది. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో అడవులదీవి ఎస్సై వెంకటరవి గరువుపాలెం వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలు పదోతరగతి తప్పడంతో ఇటీవల సప్లిమెంటరీ పరీక్ష రాసింది. నిందితులు అయిదుగురూ పదోతరగతి వరకు చదివి డీజే పనులు చేస్తున్నారు. నిందితులను నగరం మండలం సజ్జావారిపాలెం వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
మా భూమిని కబ్జా చేశారు..!
తమ పేరిట ఉన్న భూమిని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడికెళ్లినా న్యాయం జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించారు. -
అనుమానంతో హతమార్చాడు
తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం పెంచుకుని.. ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన అమానవీయ ఘటన ఇది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. -
ఇంటి పైకప్పు కూలి.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
మట్టి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. -
బస్తర్ ఫైటర్ను హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా నెలంగూర్ గ్రామానికి చెందిన సన్ను ఉసెండి(30) అనే బస్తర్ ఫైటర్ను మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. -
మందుగోలీల మధ్య సిమ్కార్డులు
ఒక్క సిమ్కార్డును ఉపయోగించి వేయి మందిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లకు వేల నంబర్లు చిక్కితే... వారి ఆగడాలకు ఇక అంతే ఉండదు. ఇప్పుడదే జరుగుతోంది. విదేశీ సైబర్ ముఠాలు ఇక్కడి యువతకు కాసుల ఎరవేసి... -
కొత్త చట్టంతో చార్మినార్లో తొలి కేసు
దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలో తొలిసారిగా చార్మినార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చారు. -
రాధాకిషన్రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయి చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. -
పొలాన్ని ధ్వంసం చేశారని రైతు బలవన్మరణం
గ్రామానికి చెందిన పలువురు కక్ష కట్టి తన భూమిని యంత్రాలతో ధ్వంసం చేశారనే ఆవేదనతో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో సోమవారం బోజడ్ల ప్రభాకర్ (42) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. -
మోసం చేశాడని ప్రియుడి మర్మాంగం కోసిన వైద్యురాలు
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణతో ప్రియుడి మర్మాంగం కోసేసింది ఓ వైద్యురాలు. ఈ ఘటన బిహార్లోని సారణ్ జిల్లా మధురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. -
రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్య
రైలు కిందపడి తండ్రి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం.. -
ఎస్పీ కార్యాలయంలోనే భార్యను పొడిచి చంపిన కానిస్టేబుల్
తనపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భార్యను కానిస్టేబుల్ అయిన ఆమె భర్త అక్కడికక్కడే హత్య చేశాడు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన లారీ దూసుకెళ్లి రహదారి పక్కనున్న ఇంటిని ధ్వంసం చేసింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పంచాయతీ పరాకువాండ్లపల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
చిన్నారి తలలో పెన్ను దిగబడి..
భద్రాచలం పట్టణం సుభాశ్నగర్ కాలనీకి చెందిన రియాన్షిక అనే అయిదేళ్ల చిన్నారికి తలలో పెన్ను దిగబడటంతో పరిస్థితి విషమంగా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!