- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime News: చదువుకున్నారు.. చోరీలను ఎంచుకున్నారు!
ఒకరు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.. మరొకరు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.. ఇంకొకరు డిగ్రీ చదివారు.
స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు, నిందితుడు విద్యాధర్తో గుంటూరు నగరం కొత్తపేట స్టేషన్ పోలీసులు
గుంటూరు నేరవార్తలు, చీరాల అర్బన్, న్యూస్టుడే: ఒకరు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.. మరొకరు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.. ఇంకొకరు డిగ్రీ చదివారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలు ఎంచుకొని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు దురలవాట్లకు బానిసలుగా మారి.. పక్కదారి పట్టారు. జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
బీటెక్ విద్యార్థి
పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన విద్యాధర్ గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఓ విశ్వవిద్యాలయంలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాల కోసం లోన్ యాప్ల్లో అప్పులు తీసుకున్నాడు. వాటిని కట్టడానికి ద్విచక్ర వాహనాలను చోరీ చేసేవాడు. గుంటూరు నగరంలోని డీమార్టు వద్ద గురువారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా విద్యాధర్ను స్థానిక కొత్తపేట స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుకున్నారు. అతడిని విచారించగా పది రోజుల వ్యవధిలో ఎనిమిది ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని సీఐ అన్వర్ బాషా తెలిపారు.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసి..
కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడుకి చెందిన ఇల్లూరి హరినాథ్రెడ్డి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. జల్సాలు, బెట్టింగులకు అలవాటు పడిన అతడు రైళ్లలో సెల్ఫోన్లు తస్కరించేవాడు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో గోవా, బెంగళూరుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో చీరాల రైల్వే స్టేషన్లో ఉన్న అతడిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.2,26,898 విలువ చేసే ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
డిగ్రీ పూర్తి చేసి..
తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన రమావత్ రవి డిగ్రీ వరకు చదువుకొని ల్యాబ్ టెక్నీషియన్గా పని చేసేవాడు. క్రికెట్ బెట్టింగ్లు, జల్సాలకు అలవాటుపడిన అతడు చోరీల బాట పట్టాడు. ఈ ఏడాది మేలో గుంటూరు కొత్తపేటలోని ఓ చిన్నపిల్లల ఆసుపత్రిలో ల్యాప్టాప్, సెల్ఫోన్తోపాటు ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు కొత్తపేటలో సంచరిస్తున్న రవిని గురువారం అరెస్టు చేశారు. 31 ఏళ్ల వయసున్న నిందితుడిపై తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 25 దొంగతనాల కేసులు నమోదైనట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో భారీ ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. ముడిపదార్థాన్ని పౌడర్గా మార్చే కిలాన్ విభాగంలోని ట్యాంకు పగిలి.. 800 డిగ్రీల పైగా వేడితో ఉన్న పొడి కార్మికుల మీద పడింది. -
మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లకు టోకరా
బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థకు సైబర్ నేరస్థులు నకిలీ మెయిల్ పంపించారు. దాన్ని నమ్మిన సంస్థ నిర్వాహకుల నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్లో ఈ ఉదంతం వెలుగుచూసింది. -
ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కోసి.. రూ. 30 లక్షల దోపిడీ
పక్కా ప్రణాళికతో ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కోసి వాటిలోని రూ.30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు ముగ్గురు ముసుగు దొంగలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాలలో చోటుచేసుకుంది. -
అవమానాలు భరించలేకే!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. గతనెల 30న రాత్రి మహబూబాబాద్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక మృతిచెందారు. -
ఆ ‘లోన్ యాప్’ వెంటనే తొలగించండి
సులభంగా రుణాలు ఇస్తామంటూ ఆన్లైనులో అనేక యాప్లు అందుబాటులోకి వస్తున్న రోజులివి. ఇటువంటి యాప్ల అనుమానాస్పద కార్యకలాపాలు, మోసాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. -
మద్యం మత్తులో ‘బీఎండబ్ల్యూ’ నడిపి.. మహిళ ఉసురు తీసిన శివసేన యువనేత
పుణెలో జరిగిన టీనేజరు కారు ప్రమాద ఘటన మరవకముందే ముంబయిలో అదే తరహా మరో ప్రమాదం నమోదైంది. శరవేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు రోడ్డుపై వెళుతున్న స్కూటీని ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందారు. -
సర్వే ల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
ఖమ్మం నగరంలోని సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ షేక్ అఫ్జల్ హసన్ శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
మందలించాడని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
అస్సాంలోని శివసాగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తక్కువ మార్కులు వచ్చాయని మందలించిన ఉపాధ్యాయుడిని 11వ తరగతి చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -
రూ. 2.89 కోట్ల బంగారం స్వాధీనం
విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ విభాగం పోలీసులు శనివారం పట్టుకున్నారు. -
డ్రగ్స్ తీసుకున్నాకే.. పబ్కు!
గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ హైదరాబాద్లోని ఓ పబ్లో నిర్వహించిన పార్టీ వ్యవహారం కలకలం రేపింది. ఖాజాగూడలోని ‘ది కేవ్’ పబ్ నిర్వాహకులు ‘సైకిడెలిక్’ పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడం చూసి పోలీసులే విస్తుపోయారు. -
మొలకెత్తని విత్తనం.. యమపాశమైన రుణభారం!
రెండు సార్లు విత్తనాలు విత్తినా వర్షాలు కురవక మొలకెత్తలేవు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చలేనన్న దిగులుతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రైలు కింద పడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్ పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. -
మద్యం మత్తులో ప్రాణం తీశారు
చిన్నపాటి గొడవతో ఓ యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని దహనం చేసిన ఘటనలో నిందితులైన 17, 18 ఏళ్లలోపు ముగ్గురు బాలలను పోలీసులు అరెస్టు చేశారు. -
మెగామాల్ నుంచి ఫోన్ నంబర్లు సేకరించి.. రూ.కోట్లు కొల్లగొట్టిన నొయిడా కిలాడీలు
మందుల దుకాణం.. డిపార్ట్మెంటల్ స్టోర్.. మెగామాల్స్.. వంటిచోట్ల కొనుగోళ్లు చేసినపుడు బిల్లింగ్ సమయంలో ఫోన్ నంబరు అడుగుతుంటారు. తప్పనిసరి కానప్పటికీ, రివార్డు పాయింట్లు వస్తాయని కొందరు..