Nithin Kamath: ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
Nithin Kamath: కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు పాల్గొనేందుకు డెట్ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంపై జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హర్షం వ్యక్తం చేశారు.
Nithin Kamath | ఇంటర్నెట్డెస్క్: కష్టపడిన సంపాదన నుంచి మెరుగైన రాబడిని అందించే మార్గాల కోసం ప్రతిఒక్కరూ అన్వేషించడం సహజం. అయితే వీటిలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం మంచిదంటే.. మరికొందరేమో స్టాక్స్లో మదుపు చేయటమే బెటర్ అని అంటుంటారు. అయితే బాండ్లలో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం అంటారు జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్ కామత్ (Nithin Kamath). సెబీ తీసుకున్న కొత్త నిర్ణయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతమంది పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుతం ఉన్న రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీనిపై హర్షం వ్యక్తంచేసిన నితిన్ ఓ ట్వీట్ చేశారు. ‘‘కంపెనీలు రూ.10,000 ముఖ విలువతో బాండ్లను జారీ చేయవచ్చు. రిటైల్ మదుపరుల్ని బాండ్ల వైపు ఆకర్షించేందుకు తీసుకున్న గొప్ప చర్య ఇది. చాలాకాలం తర్వాత పలు మార్పులతో చిన్న పెట్టుబడిదారులకు బాండ్లను అందుబాటులో తీసుకురావడానికి సెబీ (SEBI) అద్భుతమైన పని చేసింది’’ అని కొనియాడారు.
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
‘‘చాలామంది భారతీయులకు సరైన పెట్టుబడి సాధనం బాండ్లనే మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తాం. ఎందుకంటే ఇవి ఎఫ్డీ కంటే మెరుగైన రాబడి ఇస్తాయి, అలాగే స్టాక్ కంటే తక్కువ రిస్క్’’ అని కామత్ గతంలో కూడా బాండ్లపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. బాండ్లు.. ఇప్పటివరకు సంపన్న భారతీయులు మాత్రమే ఇన్వెస్ట్ చేసే మదుపు సాధనంగా ఉండేవి. తాజాగా సెబీ ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మదుపు చేసే అవకాశం కలిగింది.
గమనిక: ఈ వార్త/కథనం సమాచారం కోసం మాత్రమే. ఫలానా వాటిలో పెట్టుబడులు పెట్టాలని ఈనాడు.నెట్ సూచించడం లేదు. ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు మేరకు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడులు ఉపసంహరించొచ్చు
ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీ) మంచి స్థితిలో ఉన్న ప్రస్తుత తరుణంలో, వాటిల్లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం ముందుకెళ్లాలని ఎస్బీఐ పరిశోధనా నివేదిక సూచించింది. అందుకు ఇది సరైన సమయమనీ వివరించింది. -
రూ.2000 కోట్లు చెల్లించేందుకు బోయింగ్ సమ్మతి!
ఇండోనేషియా, ఇథియోపియాలలో ‘737 మ్యాక్స్’ విమానాలు రెండు నేలకూలి, వందలమంది మరణించిన దుర్ఘటనలపై అమెరికా న్యాయ స్థానంలో కేసును పరిష్కరించుకునేందుకు దిగ్గజ విమానాల తయారీ సంస్థ బోయింగ్ సిద్ధపడింది. -
ఇంటి కొనుగోలు కోసం ఒకే రకమైన ఒప్పంద నమూనా
నిర్మాణదారుల చేతుల్లో ఇళ్ల కొనుగోలుదారులు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఇళ్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏకరూప నమూనా రూపొందించాలని పేర్కొంది. -
స్వల్ప శ్రేణికి సూచీలు పరిమితం
ఆద్యంతం స్వల్పశ్రేణిలో కదలాడిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడం, బలహీన ఆసియా సంకేతాలు ప్రభావం చూపాయి. బ్యాంకింగ్, టెలికాం, స్థిరాస్తి షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. -
ఉద్యోగ కల్పనపై సిటీ గ్రూప్ నివేదిక వాస్తవ విరుద్ధం
భారత్ 7 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నా కూడా, సంతృప్తికర స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కష్టపడాల్సిందేనంటూ, అమెరికా కేంద్రంగా పనిచేసే ఆర్థిక సేవల సంస్థ సిటీ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ సోమవారం తోసిపుచ్చింది. -
స్కోడా నుంచి కొత్త మోడళ్లు
మనదేశంలో మరింతగా ఉనికి పెంచుకునేందుకు తన ప్రీమియం ఎస్యూవీ మోడల్ కొడియాక్లో తాజా వెర్షన్తో పాటు మరిన్ని కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు స్కోడా చూస్తోంది. -
మెర్సిడెస్ బెంజ్ ప్రారంభ స్థాయి ఈవీలు
మెర్సిడెస్ బెంజ్ తన ప్రారంభ స్థాయి విద్యుత్ వాహనాల (ఈవీల)ను సోమవారం విడుదల చేసింది. ఎస్యూవీ ఈక్యూఏ 250 ధర రూ.66 లక్షలు కాగా, కొత్త ఈక్యూబీ 350 ఎస్యూవీ (5-సీటర్) ధర రూ.77.5 లక్షలు, -
హెచ్సీఎల్ టెక్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవెలియర్ డె లా లీజియన్ డి-హానర్’ లభించిందని కంపెనీ తెలిపింది. -
గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా మ్యాప్స్కు మారండి
గూగుల్ మ్యాప్స్ నుంచి బయటకు రావాల్సిందిగా దేశీయ డెవలపర్లకు ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్ అగర్వాల్ సూచించారు. గూగుల్ మ్యాప్స్ వీడిన వారికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్ ఉచితంగా అందిస్తామని అన్నారు. -
పాన్ వివరాలు సమర్పించండి
డివిడెండ్లపై అధిక మొత్తంలో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) విధించకుండా, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వివరాలు సమర్పించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన వాటాదార్లను కోరింది. -
టాటా విమానయాన కంపెనీల విలీనంలో మరో అడుగు
టాటా గ్రూప్నకు చెందిన అన్ని విమానయాన కంపెనీల నిర్వహణ విధివిధానాల (ఆపరేటింగ్ మాన్యువల్స్)ను సమన్వయం చేయడం పూర్తయింది. -
స్పైస్జెట్ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం!
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్పైస్జెట్ ఇంకో సమస్యలో చిక్కుకుంది. గత రెండున్నరేళ్లుగా ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్) బకాయిలను జమ చేయడంలో సంస్థ విఫలమైందని ఆంగ్ల వార్తా సంస్థలు పేర్కొన్నాయి. -
కోటక్ను కింగ్డన్ తప్పుదోవ పట్టించిందా?
అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్తో ఉన్న అనుబంధంపై, హెడ్జ్ ఫండ్ అయిన కింగ్డన్ క్యాపిటల్ తమను కావాలనే తప్పుదోవ పట్టించిందా అన్న కోణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ పరిశీలన చేస్తోందని తెలుస్తోంది. -
రెండు ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ రద్దు: ఆర్బీఐ
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్ ఫిన్సర్వ్ ఇండియా అనే ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ) రిజిస్ట్రేషన్ను భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) రద్దు చేసింది. -
27 రంగాల్లో ఉపాధి 3.31% వృద్ధి
వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థిక సేవలు తదితర 27 రంగాల్లో ఉపాధి పొందిన వారి సంఖ్య 2022-23లో 3.31% పెరిగి 59.66 కోట్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. -
సంక్షిప్తవార్తలు(8)
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగేతర ఆర్థిక సేవలు (ఎన్బీఎఫ్సీ) అందించే ద్వార క్షేత్రీయ గ్రామీణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ద్వార కేజీఎఫ్ఎస్) ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
క్యాప్షన్ కోరిన రకుల్ప్రీత్.. దిశా పటానీ ‘కల్కి’ జ్ఞాపకాలు
-
నాటకాలు ఆపండి..! సొంత పార్టీ నేతలపై బైడెన్ ఆగ్రహం
-
నేటి తరానివి పిరికి హృదయాలు కావు..: అభినవ్ బింద్రా
-
‘మిడతలు, పట్టు పురుగులు తినొచ్చు’ - సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ