- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Vraj Iron and Steel IPO: వ్రజ్ ఐరన్ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి సహా పూర్తి వివరాలివే..
Vraj Iron and Steel IPO: వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ ఐపీఓ జూన్ 26-28 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.195- 207.
Vraj Iron and Steel IPO | ముంబయి: వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ ఐపీఓ (IPO) బుధవారం ప్రారంభమైంది. 28వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని కంపెనీ రూ.195- 207గా నిర్ణయించింది. రూ.171 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మదుపర్లు గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,904తో 72 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఐపీఓ (Vraj Iron and Steel IPO) ద్వారా సమీకరించిన నిధులను బిలాస్పూర్లోని తయారీ కేంద్రాన్ని విస్తరించేందుకు వినియోగించనున్నట్లు వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ వెల్లడించింది. మరికొన్నింటిని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడుకోనున్నట్లు సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో తెలిపింది. ఐపీఓలో పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లు అందుబాటులో లేవు.
ఇప్పటికే వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.51 కోట్లు సమీకరించింది. మొత్తం ఆరుగురు యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.207 వద్ద 24,78,259 షేర్లను కేటాయించింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న షేర్లలో 50 శాతం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు (QIBs), 35 శాతం రిటైల్ మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) రిజర్వ్ చేశారు. ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి. 2023లో కంపెనీ ఆదాయం 517.42 కోట్లు, లాభం రూ.54 కోట్లు, ఆస్తులు రూ.191 కోట్లుగా నమోదయ్యాయి.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- తేదీలు : జూన్ 26 - 28
- ధరల శ్రేణి : రూ.195 - 207
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 72
- కనీస పెట్టుబడి : రూ.14,904
- షేర్ల అలాట్మెంట్ : జులై 1
- రిఫండ్లు : జులై 2
- డీమ్యాట్ ఖాతాలకు షేర్ల బదిలీ : జులై 2
- లిస్టింగ్ తేదీ : జులై 3
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
-
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
-
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM