Vizag: ‘కిమ్స్’ చేతికి విశాఖ క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్
హైదరాబాద్కు చెందిన కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), విశాఖపట్నంలోని క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్ను సొంతం చేసుకోనుంది.
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), విశాఖపట్నంలోని క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్ను సొంతం చేసుకోనుంది. దీనికి సంబంధించి షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కిమ్స్ హాస్పిటల్స్ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్కు యజమానిగా ఉన్న చలసాని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 100% వాటాను కిమ్స్ హాస్పిటల్స్ కొనుగోలు చేస్తుంది. విశాఖ నడిబొడ్డున ఉన్న క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్లో 200 వైద్య పడకలు ఉన్నాయి. దీనికి దగ్గర్లో మరొక హాస్పిటల్ లేకపోవడంతో, ఎక్కువ మంది రోగులు వైద్య సేవల కోసం క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్ను సందర్శిస్తూ ఉంటారు. కిమ్స్ హాస్పిటల్స్కు ఇప్పటికే విశాఖపట్నంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మరొక గ్యాస్ట్రో యూనిట్ ఉన్నాయి. వీటికి ఇప్పుడు క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్ కూడా జత కలుస్తుంది. కిమ్స్ హాస్పిటల్స్ 2018లో విశాఖపట్నంలోని కిమ్స్-ఐకాన్ హాస్పిటల్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో ఆసుపత్రిని కొనుగోలు చేస్తోంది. దీంతో తమకు విశాఖలో 630 వైద్య పడకల సామర్థ్యం గల ఆసుపత్రులు ఉన్నట్లు అవుతుందని కిమ్స్ సీఎండీ డాక్టర్ బి.భాస్కరరావు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,392 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.7,672 కోట్ల ఆదాయం, రూ.1,392 కోట్ల నికరలాభం నమోదు చేసింది. -
15 ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్లో భారత బ్రాండ్లే రాలేదు
‘ఎక్కడ చూసినా సీసీ కెమేరాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చైనా నుంచి వచ్చిన విడిభాగాలతో, చిప్లతోనే ఇక్కడ తయారయ్యాయి. -
దేశీయ ఉక్కు ఉత్పత్తి 300 మి.టన్నులకు చేరొచ్చు
ఉక్కు గిరాకీపై కేంద్రం ఆశావహంగా ఉంది. 2030 కల్లా దేశీయ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులను అధిగమించగలదని ఉక్కు శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా అంచనా వేశారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభంలో 10% వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత పద్ధతిలో రూ.11,695.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
పెప్సీకో ఇండియా ఆదాయం రూ.5,954 కోట్లు
గత ఏడాది ఏప్రిల్- డిసెంబరులో పెప్సీకో ఇండియా హోల్డింగ్స్ ఏకీకృత ఆదాయం రూ.5,954.16 కోట్లుగాను, నికర లాభం రూ.217.26 కోట్లుగా నమోదైంది. -
14 ఏళ్ల తర్వాత తొలిసారిగా పెరిగిన కోల్ ఇండియా భూగర్భ బొగ్గు ఉత్పత్తి
గత 14 ఏళ్లలో తొలిసారిగా కోల్ ఇండియా తన భూగర్భ బొగ్గు ఉత్పత్తిలో ప్రతికూల ధోరణి నుంచి బయటపడింది. -
హిమాచల్ ప్రదేశ్ వెళ్లే ట్రక్కులకు పన్ను మినహాయింపు
వివిధ రాష్ట్రాల నుంచి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లే ట్రక్కులకు ప్రత్యేక రోడ్డు పన్ను(ఎస్ఆర్టీ) నుంచి మినహాయింపునిస్తున్నట్లు రవాణా విభాగం ఒక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. -
భారీగా పెరిగిన పీఎన్బీ లాభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జూన్ త్రైమాసికంలో రూ.3,252 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(9)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో అధికాదాయం కారణంగా ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఏకీకృత నికర లాభం 12% వృద్ధితో రూ.5,506.07 కోట్లుగా నమోదైంది. -
స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
-
ఇంటి ముంగిటకే.. అమెరికా డాక్టరు!
-
విద్యార్థుల జుత్తు కత్తిరించిన ఉపాధ్యాయురాలు.. సస్పెండ్ చేసిన డీఈవో
-
కుంతీ కుమారి.. ఓ కార్పొరేట్ ఆసుపత్రి.. గర్భస్థ శిశువు అవశేషాల కోసం వెతుకులాట
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/07/24)
-
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణకు జిష్ణు దేవ్ వర్మ