- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 World Cup: స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
T20 World Cup: స్టాక్స్, భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడాన్ని పోల్చుతూ వీరేంద్ర సెహ్వాగ్ చక్కని వివరణ ఇచ్చారు. ఇకపై భారత జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షించారు.
దిల్లీ: స్టాక్స్, భారత్ టీ20 కప్ (T20 World Cup) గెలవడం మధ్య సారూప్యత ఏమైనా ఉందా?.. ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా! భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ రెండింటి మధ్య చక్కని పోలికను వివరించారు. కప్పు గెలిచిన సందర్భంగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. దాన్ని స్టాక్మార్కెట్కు అన్వయిస్తూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు.
స్టాక్లలో లాగా సుదీర్ఘ స్థిరీకరణ తర్వాత భారత జట్టుకు ఒక బ్రేకౌట్ లభించింది. ఏళ్లపాటు నిరోధం (Resistance) ఎదుర్కొన్న స్టాక్ ఒక్కసారిగా కొన్నేళ్ల రికార్డును దాటుతుంటుంది. టీమ్ఇండియాకు కూడా బహుశా అలాంటి బ్రేకౌట్ విజయమే. ఏళ్లుగా ఒక రేంజ్లో నిలకడగా ఆడుతూ వచ్చింది. జట్టు చక్కగా కుదురుకుంది. కానీ, ఐసీసీ ట్రోఫీల్లాంటి నిరోధాలను మాత్రం అధిగమించలేకపోయింది. తాజాగా లభించిన విజయం బహుశా 13 ఏళ్ల బ్రేకౌట్గా అనిపించింది. ఇక నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్ వరుస విజయాలను నమోదు చేస్తుందని విశ్వసిస్తున్నా’’ అని సెహ్వాగ్ పోస్ట్ చేశారు. భారత్ 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేదు.
స్టాక్ మార్కెట్లో ఒక షేరు నిర్దిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత నిరోధం ఎదుర్కొంటుంటుంది. అంటే ఆ స్థాయిని మించి పైకి వెళ్లలేకపోతుంది. ఇది కంపెనీ పనితీరు, మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే, పరిస్థితులు అనుకూలించినప్పుడు దాన్ని దాటుకొని ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్తుంది. దీన్ని బ్రేకౌట్గా వ్యవహరిస్తారు. అప్పుడు ఆ స్టాక్కు కొత్త రికార్డులను నెలకొల్పుతూ నూతన నిరోధ స్థాయిని ఏర్పరచుకుంటుంది. సాధారణంగా స్టాక్ విలువ గరిష్ఠానికి చేరినప్పుడు నిరోధం ఎదురవుతుంది. అంటే ఆ షేరుకు అంతకు మించి వెచ్చించడం అవసరం లేదని మదుపర్ల భావన!
తాజాగా భారత జట్టు సైతం ఏళ్లుగా నిరోధ స్థాయిని ఎదుర్కొందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఐసీసీ ట్రోఫీలను ఆయన నిరోధంగా వ్యవహరించారు. తాజాగా దాన్ని అధిగమించి విజయం సాధించటంతో బ్రేకౌట్ లభించినట్లు అభివర్ణించారు. ఇకపై వరుస విజయాలతో రికార్డులు నెలకొల్పుతుందని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
కొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 443, నిఫ్టీ 131 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. -
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
Niva Bupa IPO: ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా ఐపీఓకు రాబోతోంది. సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్లో సెర్చ్ చేయొచ్చు!
Meta AI: వాట్సప్లో ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏ సమాచారం అయిన క్షణాల్లో తెలుసుకోవడానికి వీలుపడుతుంది. -
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
ITR filing 2023-24: ఐటీఆర్ దాఖలు చేసే సమయం దగ్గర పడటంతో అందరూ రిటర్నులు ఫైల్ చేయడం మొదలు పెట్టేశారు. అసలు రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా? -
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..
LPG commercial cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్పై రూ.32 తగ్గడం గమనార్హం. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 79,113 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,023 దగ్గర కొనసాగుతోంది. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి!
-
అమరావతిపై చంద్రబాబు సమీక్ష.. ఎల్లుండి శ్వేతపత్రం
-
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
-
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్: దామోదర రాజనర్సింహ
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
-
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!