- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
KYC update: బ్యాంకులు రీ కేవైసీ అడుగుతున్నాయా? ఆన్లైన్లో సులువుగా చేసుకోండిలా..
KYC update: బ్యాంకులు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తరచూ చెబుతుంటాయి. సులువుగా మీరే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
KYC update | ఇంటర్నెట్డెస్క్: బ్యాంకులో ఖాతా ఉన్నా.. మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నా.. ఇతర ఆర్థిక కార్యకలాపాలు సజావుగా జరగాలన్నా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. కస్టమర్ల ఖాతాకు భద్రతను పెంచడంతో పాటు, మోసాలను నివారించడంలో భాగంగా బ్యాంకులు కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కోరుతుంటాయి. ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు కేవైసీ వివరాలు ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. బ్యాంక్ పోర్టల్లోకి వెళ్లి సులువుగా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంకును బట్టి ఈ ప్రక్రియలో చిన్న చిన్న మార్పులుంటాయి. ప్రధాన బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్లో పోర్టల్లోకి లాగిన్ అయ్యి ‘My Accounts & Profile’ సెక్షన్ కింద కనిపించే ‘Update KYC’పై క్లిక్ చేయాలి. ఎస్బీఐ అకౌంట్ను ఎంచుకొని ‘Next’పై క్లిక్ చేసి మీరు సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి.
హెచ్డీఎఫ్సీ: హెచ్డీఎఫ్సీలో రీ- కేవైసీని వెబ్సైట్లోనే సులువుగా చేసుకోవచ్చు. పోర్టల్లోని వ్యక్తిగత విభాగంలో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. లేదంటే బ్యాంక్ నుంచి సంబంధిత ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి, పత్రాలు జోడించి దగ్గర్లోని బ్యాంకు శాఖకు పంపించాలి. లేదంటే నేరుగా బ్యాంకు శాఖలో అందించొచ్చు.
వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ.లక్షన్నర పైనే!
ఐసీఐసీఐ: ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీ కేవైసీ అప్డేట్ చేయాల్సిఉంటే స్క్రీన్పైనే చూపిస్తుంది. అక్కడే కనిపించే ఆథరైజేషన్ బాక్స్పై టిక్ చేసి ‘Update Through Document Upload’ ఆప్షన్ను ఎంచుకోండి. వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసి పాన్ కార్డ్ను అప్లోడ్ చేయాలి. చిరునామా వివరాలను కూడా అక్కడే మార్చుకోవచ్చు.
కెనరా బ్యాంక్: లాగిన్ వివరాలతో కెనరా బ్యాంక్ వెబ్సైట్లో లాగిన్ అవగానే ‘services’ కింద కనిపించే ‘Re-KYC’పై క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేసేయొచ్చు.
యెస్ బ్యాంక్ అయితే.. బ్యాంక్ పోర్టల్లో లాగిన్ అవ్వగానే రీ- కేవైసీని పాప్-అప్ ఉంటుంది. ఆధార్ అథెంటికేషన్లో కేవైసీ పూర్తి చేయొచ్చు. చిరునామాల్లో ఏవైనా మార్పులున్నా చేసుకోవచ్చు. పాస్పోర్ట్, పాన్ కార్డ్, భారత ప్రభుత్వం జారీ చేసిన ఈ- ఆధార్ లెటర్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, NREGA జారీ చేసిన జాబ్కార్డ్ లను చిరునామా, ఐడీ ప్రూఫ్గా అంగీకరిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది. -
జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
Zomato: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. -
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
T20 World Cup: స్టాక్స్, భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడాన్ని పోల్చుతూ వీరేంద్ర సెహ్వాగ్ చక్కని వివరణ ఇచ్చారు. ఇకపై భారత జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షించారు. -
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
ఎస్బీఐ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తదుపరి ఛైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది. -
నాణ్యత లేదు.. ప్రమాణాలు లేవు
దేశంలోని చిన్న, మధ్య తరహా ఫార్మా యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆతిథ్య రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!
వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
2024-25లో దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాణించిన చిన్న షేర్లు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది. -
సెల్కాన్ గ్రూపు నుంచి వైఫై-6 రౌటర్లు
మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, యాక్సెసరీలు అందిస్తున్న సెల్కాన్ గ్రూపు వైఫై-6 రౌటర్ల విభాగంలోకి అడుగుపెడుతోంది. -
హెచ్సీజీ చేతికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్?
విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను దేశంలోని అతిపెద్ద క్యాన్సర్ వైద్య సేవల సంస్థ అయిన హెచ్సీజీ సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. -
రూ.12,000 కోట్ల సమీకరణలో ఎన్టీపీసీ
ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ.. మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించనుంది. -
సంక్షిప్త వార్తలు
అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్ కంపెనీ బంగ్లాదేశ్లో తన ఆభరణాల బ్రాండ్ తనిష్క్ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. -
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
Jio Safe- Jio Translate: రిలయన్స్ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్, రెండోది జియో ట్రాన్స్లేట్.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాకు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ
-
ఆ పార్టీ ఎంపీకే ‘డిప్యూటీ’ ఇవ్వండి.. టీఎంసీ విజ్ఞప్తి
-
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జాగిలాల సాయంతో పబ్బుల్లో పోలీసుల తనిఖీలు