- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Unacademy Layoffs: మరోసారి ఉద్యోగులను తొలగించిన అన్అకాడమీ
Unacademy lays off: వ్యయ నియంత్రణలో భాగంగా ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ మరోసారి ఉద్యోగులను తొలగించింది.
Unacademy lays off | ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్బ్యాంకు పెట్టుబడులున్న ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ (Unacademy) మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
2023 మార్చిలోనే అన్అకాడమీ తొలగింపులు చేపట్టింది. కంపెనీ ఆన్లైన్ వ్యాపార వృద్ధి క్షీణించిన కారణంగా మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం నుంచి 12 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఆ తర్వాత నష్టాలను తగ్గించుకోవడంతో పాటు నిధుల్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా గత రెండేళ్లలో దాదాపు 1,500 - 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. స్థిరమైన వృద్ధి, వ్యాపార సామర్థ్యం లాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే..
తమ కంపెనీలోని ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయాన్ని సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. లేఆఫ్కు గురైన వారిలో మార్కెటింగ్, సేల్స్తో సహా వివిధ భాగాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఉన్నారు. తాజాగా అన్అకాడమీ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ ముంజాల్ స్టార్టప్ సంస్థల వైఫల్యాల గురించి ప్రస్తావించారు. ఈ విషయం తెలిపిన మరుసటి రోజే సంస్థ నుంచి లేఆఫ్ ప్రకటన రావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. 2023 మార్చి నాటికి కంపెనీ ఆదాయం 26.15 శాతం వృద్ధి చెందింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు 41 శాతం మేర తగ్గి రూ.1,678 కోట్లకు చేరుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. -
ఎయిర్టెల్ కస్టమర్ల డేటా లీక్?.. ఖండించిన టెలికాం సంస్థ
Airtel Data Leak: తమ కస్టమర్ల వ్యక్తిగత వివరాలు హ్యాకర్లు తస్కరించారని వస్తున్న వార్తల్ని ఎయిర్టెల్ ఖండించింది. -
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
Adani Hindenburg Row: అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వెనక చైనా హస్తం ఉందని ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 492 పాయింట్ల నష్టంతో 79,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,201 వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది. -
సిలిండర్లకు క్యూఆర్ కోడ్!
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. -
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. -
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్ వర్గాలకు సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ పిలుపునిచ్చారు. -
యులిప్.. ఎప్పుడు తీసుకోవాలంటే..
బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
-
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?