- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Today Stock Market: పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు.
షేర్లు అధిక విలువకు చేరడమే కారణం
ఔషధ, ఐటీ షేర్లు రాణించొచ్చు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్ మార్కెట్
ఈ వారం
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ సెంటిమెంటు, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ వారం నిఫ్టీ 23,700 స్థాయిని పరీక్షించే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 24,200-23,700 మధ్య చలించొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతికూల ధోరణితో కదిలినపుడల్లా, కొనుగోళ్లకు అవకాశంగా భావించొచ్చని డెరివేటివ్ విశ్లేషకులు చెబుతున్నారు. మనదేశం, అమెరికాల్లో వడ్డీరేట్ల కోత ఎప్పుడు ప్రారంభం అవుతుందనే అంశంపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. రుతుపవనాల కదలిక, ముడిచమురు ధరలు, డాలర్తో పోలిస్తే రూపాయి కదలికలు ప్రభావం చూపుతాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- ప్రభావం చూపే వార్తలేవీ లేనందున ఎఫ్ఎమ్సీజీ షేర్లలో పరిమిత లాభాలే కనిపించొచ్చు. బడ్జెట్ ప్రకటన వరకు స్తబ్దుగానే చలనాలు ఉండొచ్చు. గత రెండేళ్లుగా బలహీన రుతుపవనాల వల్ల డీలాపడ్డ ఎఫ్ఎమ్సీజీ షేర్లు వెలుగులోకి రావొచ్చని అంచనా.
- బ్యాంక్ నిఫ్టీ 53,200 స్థాయిని అధిగమిస్తే కనుక 54,000 పాయింట్ల దిశగా ర్యాలీ జరగొచ్చు. 51,000 వద్ద మద్దతు, 53,700 వద్ద నిరోధం కనిపిస్తున్నాయి. బ్యాంకుల త్రైమాసిక పనితీరు నివేదికలపై మదుపర్లు దృష్టి సారించొచ్చు.
- చాలా వరకు వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. జూన్ విక్రయాల్లో వృద్ధి వల్ల కొన్ని షేర్లలో లాభాలు కనిపించొచ్చు. స్వల్పకాలంలో ఆటో సూచీలో కొంత ఊగిసలాటలు కనిపించొచ్చు. 24,800 స్థాయి పైకి వెళ్లగలిగితే లాభాలుంటాయి. లేదంటే 24,500కు పడిపోవచ్చు.
- టారిఫ్ల పెంపు నేపథ్యంలో టెలికాం కంపెనీలైన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పరిమిత లాభాలు నమోదు చేయొచ్చు. టారిఫ్ల పెంపు ప్రభావం ఇప్పటికే షేర్లపై కనిపించడం ఇందుకు నేపథ్యం. జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మాత్రం పెరిగే అవకాశం ఉందని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.
- బలమైన ఆర్థిక ఫలితాల అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు రాణించొచ్చు. అయితే కొద్ది నెలల ర్యాలీ వల్ల షేర్లకు ఏర్పడ్డ అధిక విలువల కారణంగా లాభాలు పరిమితంగానే ఉండొచ్చు.
- మార్కెట్లో ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, ఔషధ షేర్లు రాణించే అవకాశం ఉంది.
- ప్రభావం చూపే వార్తలు లేనందున రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా చమురు ఉత్పత్తి, మార్కెటింగ్ కంపెనీలు చాలా తక్కువ శ్రేణిలో చలించొచ్చు. అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువలను పరిశీలించొచ్చు.
- సిమెంటు రంగంలో చోటుచేసుకుంటున్న కంపెనీల స్వాధీనతలు, ఈ రంగ స్థిరత్వానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
- ఇటీవలి లాభాల అనంతరం లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణిలో చలించొచ్చు. ఈ వారం లోహ సూచీ 9,000 పాయింట్లకు పడిపోవచ్చు. 10,050 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు.
- ఐటీ కంపెనీల షేర్లు లాభాలను అందించొచ్చు. అమెరికా ఫెడ్ రేట్ల కోత అమలు సమయం, ఎంత పరిమాణంలో ఉండొచ్చనే అంశాలు ప్రభావం చూపుతాయి. సమీప కాలంలో నిఫ్టీ ఐటీ సూచీ 37,500కు చేరొచ్చు. తదుపరి లక్ష్యం 39,000 వద్ద ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
టెస్లా కార్ స్క్రీన్లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్మస్క్కు ట్యాగ్ చేసింది. దీనిపై మస్క్ సమాధానం ఇచ్చారు. -
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!