Tata Motors: జులై నుంచి టాటా వాహనాల ధరలు పెంపు

Tata Motors: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది.

Published : 19 Jun 2024 14:53 IST

Tata Motors | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ (Tata motors) మరోసారి వాహనాల ధరల పెంపునకు (Price hike) సిద్ధమైంది. వాణిజ్య వాహనాల ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 2శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

నేడే 2 ఐపీఓలు ప్రారంభం.. రూ.550 కోట్ల సమీకరణ.. పూర్తి వివరాలివే

నిర్వహణ వ్యయాలు, ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. నిర్దిష్ట మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా ధరల పెంపులో మార్పు ఉంటుంది. అయితే కంపెనీ వాణిజ్య వాహన ధరల్ని పెంచడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. మరోవైపు కంపెనీ టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా ప్రకటించింది. ఇకపై కమర్షియల్‌ వాహన విభాగం, దాని పెట్టుబడులు ఓ సంస్థగా ఉంటాయి. ప్యాసింజర్‌, ఎలక్ట్రిక్‌, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌తో కూడిన ప్రయాణికుల వాహన విభాగం, దాని పెట్టుబడులు ఇంకో సంస్థగా ఉండనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని