- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock market: రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది.
80,000 ఎగువన ముగిసిన సెన్సెక్స్
సమీక్ష
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. నిఫ్టీ కూడా తాజా గరిష్ఠానికి చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.52% నష్టంతో 86.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై నష్టపోగా, మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
- మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.447.30 లక్షల కోట్లు (5.36 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.
- సెన్సెక్స్ ఉదయం 80,321.79 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,392.64 వద్ద కొత్త గరిష్ఠాన్ని తాకిన సూచీ, లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చింది. చివరకు 62.87 పాయింట్ల లాభంతో 80,049.67 వద్ద ముగిసింది. నిఫ్టీ 15.65 పాయింట్లు పెరిగి 24,302.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,401 దగ్గర రికార్డు గరిష్ఠాన్ని తాకింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 14 లాభాలు నమోదుచేశాయి. హెచ్సీఎల్ టెక్ 2.85%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.65%, టాటా మోటార్స్ 2.40%, సన్ఫార్మా 1.66%, టీసీఎస్ 1.42%, ఇన్ఫోసిస్ 1.32%, కోటక్ బ్యాంక్ 1.26%, ఎం అండ్ ఎం 0.89% చొప్పున లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.36%, బజాజ్ ఫైనాన్స్ 1.97%, టెక్ మహీంద్రా 1.47%, ఎల్ అండ్ టీ 1.12%, అల్ట్రాటెక్ 0.95% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. ఆరోగ్య సంరక్షణ 1.17%, ఐటీ 1.12%, టెక్ 0.98%, వాహన 0.88%, టెలికాం 0.73% పెరిగాయి. మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్ఎమ్సీజీ, ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్ నీరసించాయి. బీఎస్ఈలో 2117 షేర్లు లాభాల్లో ముగియగా, 1821 స్క్రిప్లు నష్టపోయాయి. 83 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- రుణరహిత కంపెనీగా ఐనాక్స్ విండ్: కంపెనీలో ప్రమోటర్ సంస్థ ఐనాక్స్ విండ్ ఎనర్జీ రూ.900 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో రుణ రహిత సంస్థగా మారినట్లు ఐనాక్స్ విండ్ ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో ఐనాక్స్ విండ్ షేరు 10.29% లాభంతో రూ.157 వద్ద ముగిసింది. ఐనాక్స్ విండ్ ఎనర్జీ షేరు 5% దూసుకెళ్లి రూ.7,562 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే ముగిసింది.
- ఎంక్యూర్ ఫార్మా ఐపీఓ రెండో రోజుకు 4.98 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,37,03,538 షేర్లను ఆఫర్ చేయనుండగా, 6,81,87,028 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ విభాగంలో 3.43 రెట్ల స్పందన నమోదైంది.
- బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ ఐపీఓ రెండో రోజుకు 5.72 రెట్ల స్పందన దక్కింది. ఇష్యూలో భాగంగా 2,14,60,906 షేర్లను ఆఫర్ చేయగా, 12,28,12,970 షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ విభాగంలో 6.18 రెట్ల స్పందన కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదానీ గ్రూప్పై నివేదిక 2 నెలల ముందే కింగ్డన్ చేతికి
అదానీ గ్రూప్పై అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా రూపొందించిన నివేదికను ప్రచురించడానికి రెండు నెలల ముందే, -
ప్రీమియం ఎకానమీ సీట్లతో ఎయిరిండియా కొత్త విమానం
ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానమైన ఎ320 నియో, ఎయిరిండియాకు చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, -
సానుకూలతలకు అవకాశం
రాబోయే బడ్జెట్పై ఆశావహ దృక్పథంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలు వృద్ధిరేటు పెంచేందుకు దోహదం చేసేలా ఉంటాయనే అంచనాలున్నాయి. -
పసిడి-వెండి రాణింపు
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలించొచ్చు. అమెరికా ఉద్యోగ గణాంకాలకు తోడు డాలర్ బలహీనపడే వీలుండటం ఇందుకు నేపథ్యం. బంగారం కాంట్రాక్టుకు రూ.73,666 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
78500-78900 ఎగువన లాభాలే!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే గణాంకాలకు తోడు బడ్జెట్పై అంచనాలు మెరుగవ్వడం, రుతుపవనాలు పుంజుకోవడం కలిసొచ్చాయి. -
అపోలో హెల్త్లో అపోలో హాస్పిటల్స్కు మరింత వాటా
అనుబంధ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్లో రూ.103.2 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఈ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. -
పీ అండ్ ఎస్ బ్యాంక్ 100 కొత్త శాఖలు
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 100 శాఖలను తెరిచే ప్రణాళికలో ఉన్నట్లు ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ (పీ అండ్ ఎస్) బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా వెల్లడించారు. -
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కట్టడికి ఏడు ప్రతిపాదనలు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ వల్ల అత్యధికులు నష్టపోతున్న నేపథ్యంలో.. చిన్న మదుపర్లను కాపాడటంతో పాటు, నియంత్రణపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు వచ్చిన 7 ప్రతిపాదనలపై సెబీ నియమించిన... -
పొదుపు ఖాతాల్లో మరిన్ని సదుపాయాలు: ఐఓబీ
రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), పొదుపు ఖాతాల (ఎస్బీ అకౌంట్)పై మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.