- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock market: గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
సమీక్ష
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, టెలికాం షేర్లు డీలాపడ్డాయి. ఐటీ షేర్లు మాత్రం కొనుగోళ్లతో కళకళలాడాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 83.48 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.66% లాభంతో 87.17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్ మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 79,840.37 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్లో 79,855.87 వద్ద జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకిన సూచీ, అమ్మకాలతో వెనక్కి వచ్చింది. ఒకదశలో 79,231.11 వద్ద కనిష్ఠానికి చేరినా, చివరకు 34.74 పాయింట్ల నష్టంతో 79,441.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.10 పాయింట్లు తగ్గి 24,123.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,236.35 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.
- హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 2.16% నష్టపోయి రూ.1,769.60 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ.7,777.33 కోట్లు తగ్గి రూ.3.51 లక్షల కోట్లకు పరిమితమైంది. గతంలో హిండెన్బర్గ్ నివేదిక వెలుగు చూశాక, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. వీటి నుంచి లాభాలు పొందేందుకు కోటక్ బ్యాంక్, బ్రోకరేజీ విదేశీ మదుపరి చేత ఖాతా తెరిచినట్లు హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. భారతీ ఎయిర్టెల్ 2.38%, కోటక్ బ్యాంక్ 2.16%, టాటా మోటార్స్ 2.07%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.89%, ఎస్బీఐ 1.87%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.79%, బజాజ్ ఫైనాన్స్ 1.54%, టైటన్ 0.93%, ఐటీసీ 0.92%, నెస్లే 0.86% నష్టపోయాయి. ఎల్ అండ్ టీ 2.74%, ఇన్ఫోసిస్ 1.97%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.51%, టీసీఎస్ 0.80% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో.. టెలికాం 1.31%, బ్యాంకింగ్ 0.91%, వాహన 0.74%, ఆర్థిక సేవలు 0.67% తగ్గాయి. ఐటీ, యంత్ర పరికరాలు, స్థిరాస్తి, టెక్ రాణించాయి. బీఎస్ఈలో 2036 షేర్లు లాభపడగా, 1880 స్క్రిప్లు నష్టపోయాయి. 92 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
- స్టాక్ బ్రోకింగ్ షేర్లు కుదేల్: సభ్యులందరికీ ఒకే విధమైన ఛార్జీలు విధించే వ్యవస్థను అమలు చేయాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల (ఎంఐఐలు)ను సెబీ ఆదేశించడంతో స్టాక్ బ్రోకింగ్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఏంజెల్ వన్ 8.72%, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 6.83%, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.19%, ఎస్ఎంసీ గ్లోబల్ 2.81%, డోలాట్ ఆల్గోటెక్ 2.28%, 5పైసా క్యాపిటల్ 0.05% నష్టాలు చవిచూశాయి.
- డివైన్ పవర్ ఎనర్జీ దూకుడు: ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్ల తయారీ సంస్థ డివైన్ పవర్ ఎనర్జీ షేరు అరంగేట్రంలో దూసుకెళ్లింది. ఇష్యూ ధర రూ.40తో పోలిస్తే ఎన్ఎస్ఈ ఎమర్జ్పై 287.50% లాభంతో రూ.155 వద్ద షేరు ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరకు రూ.150 వద్ద షేరు ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.322.01 కోట్లుగా నమోదైంది.
- అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ షేరు, ఇష్యూ ధర రూ.281తో పోలిస్తే బీఎస్ఈలో 13.20% లాభంతో రూ.318.10 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో రూ.324.40 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 13.11% లాభంతో రూ.317.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,890.59 కోట్లుగా నమోదైంది.
- బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా కార్యకలాపాలు జరిపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద దాఖలు చేసిన దరఖాస్తును తమ అనుబంధ సంస్థ జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నట్లు జొమాటో వెల్లడించింది. రుణ వ్యాపారంలో ముందుకు వెళ్లాలని భావించడం లేదని సంస్థ స్పష్టం చేసింది. బీఎస్ఈలో జొమాటో షేరు 2.45% లాభంతో రూ.209.05 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది. -
సిలిండర్లకు క్యూఆర్ కోడ్!
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. -
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. -
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్ వర్గాలకు సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ పిలుపునిచ్చారు. -
యులిప్.. ఎప్పుడు తీసుకోవాలంటే..
బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
మీ డబ్బు సురక్షితంగా..
ఆర్థిక లావాదేవీలు డిజిటల్లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది. -
పింఛను పాలసీ తీసుకోవచ్చా?
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్ రేటింగ్ బాగున్న వాటినే ఎంచుకోవాలి. -
క్రెడిట్ స్కోరు ఈ సంగతులు తెలుసుకోండి
ప్రతి చిన్న అవసరానికీ అప్పు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రెడిట్ బ్యూరో ఎక్స్పీరియన్ ఇండియా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రుణ వితరణలో 19 శాతం వరకూ వృద్ధి నమోదయ్యింది. -
విద్యుత్తు ఉపకరణాల సంస్థల్లో
విద్యుత్తు రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా, పంపిణీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది.