- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock Market: రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 80,210 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకొని 24,357 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 80,210 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్లో ఈ సూచీ 80,331 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకొని 24,357 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో 24,372.15 వద్ద రికార్డు స్థాయిని అందుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.54 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 (Sensex) సూచీలో టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇటీవల వెలువడిన పలు స్థూల ఆర్థిక గణాంకాలు రేట్ల కోతకు దారితీసే సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దీంతో అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. అక్కడినుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 86.86 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.5,484 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.924 కోట్ల వాటాలను విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
-
మార్కెట్కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇకపై హాస్పిటల్కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి సిన్హా
-
రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
-
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..