- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock Market: సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:54 గంటల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 దగ్గర కొనసాగుతున్నాయి.
Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్లోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి. 79,787 దగ్గర సెన్సెక్స్, 24,209 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ను ప్రారంభించాయి. అనంతరం కొనుగోళ్ల అండతో తొలిసారి 80,000 కీలక మైలురాయిని తాకిన సెన్సెక్స్ 80,074 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. నిఫ్టీ 24,296 దగ్గర తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:54 గంటల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 దగ్గర కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్-30 (Sensex) సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్, రిలయన్స్, టైటన్, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా సూచీలూ సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 86.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.2,000 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.648 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 492 పాయింట్ల నష్టంతో 79,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,201 వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది. -
సిలిండర్లకు క్యూఆర్ కోడ్!
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. -
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. -
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్ వర్గాలకు సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ పిలుపునిచ్చారు. -
యులిప్.. ఎప్పుడు తీసుకోవాలంటే..
బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
మీ డబ్బు సురక్షితంగా..
ఆర్థిక లావాదేవీలు డిజిటల్లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది. -
పింఛను పాలసీ తీసుకోవచ్చా?
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్ రేటింగ్ బాగున్న వాటినే ఎంచుకోవాలి. -
క్రెడిట్ స్కోరు ఈ సంగతులు తెలుసుకోండి
ప్రతి చిన్న అవసరానికీ అప్పు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రెడిట్ బ్యూరో ఎక్స్పీరియన్ ఇండియా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రుణ వితరణలో 19 శాతం వరకూ వృద్ధి నమోదయ్యింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్