Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,020

Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 80 పాయింట్ల లాభంతో 79,113 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,023 దగ్గర కొనసాగుతోంది.

Updated : 01 Jul 2024 10:02 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు వీటిపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 80 పాయింట్ల లాభంతో 79,113 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,023 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 86.42 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.23 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.6,658 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. స్టాక్‌ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని