- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock Market: ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. నిఫ్టీ @ 24,120
Stock Market Opening bell: ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకి 24,119 దగ్గర కొనసాగుతోంది.
Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకి 24,119 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.40 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 (Sensex) సూచీలో ఎన్టీపీసీ, సన్ఫార్మా, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఎస్బీఐ, రిలయన్స్, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా సూచీలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 86.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.7,659 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,606 కోట్ల వాటాలను విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తదుపరి ఛైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది. -
నాణ్యత లేదు.. ప్రమాణాలు లేవు
దేశంలోని చిన్న, మధ్య తరహా ఫార్మా యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆతిథ్య రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!
వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
2024-25లో దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాణించిన చిన్న షేర్లు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది. -
సెల్కాన్ గ్రూపు నుంచి వైఫై-6 రౌటర్లు
మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, యాక్సెసరీలు అందిస్తున్న సెల్కాన్ గ్రూపు వైఫై-6 రౌటర్ల విభాగంలోకి అడుగుపెడుతోంది. -
హెచ్సీజీ చేతికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్?
విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను దేశంలోని అతిపెద్ద క్యాన్సర్ వైద్య సేవల సంస్థ అయిన హెచ్సీజీ సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. -
రూ.12,000 కోట్ల సమీకరణలో ఎన్టీపీసీ
ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ.. మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించనుంది. -
సంక్షిప్త వార్తలు
అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్ కంపెనీ బంగ్లాదేశ్లో తన ఆభరణాల బ్రాండ్ తనిష్క్ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. -
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
Jio Safe- Jio Translate: రిలయన్స్ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్, రెండోది జియో ట్రాన్స్లేట్.
తాజా వార్తలు (Latest News)
-
ఎవరిని అడగాలి?తిరిగిరాని ధరణి స్లాట్ రద్దు సొమ్ములు
-
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
-
ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేత.. భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం