Stock Market: ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. నిఫ్టీ @ 24,120

Stock Market Opening bell: ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకి 24,119 దగ్గర కొనసాగుతోంది.

Published : 28 Jun 2024 09:39 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకి 24,119 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.40 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా సూచీలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 86.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.7,659 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,606 కోట్ల వాటాలను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని