Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,740

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 37 పాయింట్ల లాభంతో 78,090 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 23,739 దగ్గర కొనసాగుతోంది.

Updated : 26 Jun 2024 09:51 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు (Stock Market) బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 37 పాయింట్ల లాభంతో 78,090 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 23,739 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, అదానీ పోర్ట్స్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఎన్విడియా స్టాక్‌ పుంజుకోవటంతో నాస్డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు లాభపడ్డాయి. డోజోన్స్‌ నష్టాలను నమోదు చేసింది. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.1,176 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.150 కోట్ల వాటాలను అమ్మేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని