Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,200

Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 492 పాయింట్ల నష్టంతో 79,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,201 వద్ద ట్రేడవుతోంది.

Published : 05 Jul 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 492 పాయింట్ల నష్టంతో 79,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,201 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇండిపెండెన్స్‌ డే నేపథ్యంలో అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం పనిచేయలేదు. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 87.11 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.2,576 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.2,375 కోట్ల వాటాలను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని