- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Agricultural Loans: వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది.
దిల్లీ: వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. ఇప్పటికే గృహరుణాల వంటివి మంజూరు చేసేందుకు ఆర్ఏసీపీసీ (రిటైల్ అసెట్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్)లను ఎస్బీఐ నిర్వహిస్తున్న సంగతి విదితమే. డిజిటల్ బ్యాంకింగ్ అనూభూతిని పెంచేందుకు తన యాప్లకు మరిన్ని ప్రత్యేకతలను జోడించింది. వీటితో సహా మొత్తం 11 కొత్త కార్యక్రమాలకు తన 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ శ్రీకారం చుట్టింది.
- డిజిటల్ చెల్లింపుల అనుభూతిని విస్తరించేందుకు రెండు కొత్త ప్రత్యేకతలను ఎస్బీఐ పరిచయం చేసింది. బీమ్ ఎస్బీఐ పే యాప్లో ‘టాప్ అండ్ పే’ సదుపాయంతో పాటు, యోనో యాప్లో ‘మ్యూచువల్ ఫండ్స్పై డిజిటల్ రుణాలను అందించేందుకు’ శ్రీకారం చుట్టినట్లు తెలిపింది.
- ఇళ్ల పైకప్పులపై సౌరపలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా, సౌర విద్యుదుత్పత్తికి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం సూర్య ఘర్ పథకం కింద రుణాలు ఇచ్చేందుకు ఎస్బీఐ ‘సూర్య ఘర్ లోన్’ పథకాన్ని ప్రారంభించింది. 10 కిలోవాట్ సామర్థ్యం వరకు సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎంఎన్ఆర్ఈ/ ఆర్ఈసీ పోర్టల్లో దరఖాస్తు నమోదు దగ్గర నుంచి రుణ మంజూరు వరకు పూర్తి ప్రక్రియ ఎస్బీఐ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారానే జరగనుంది.
- ఎన్ఆర్ఐ వినియోగదార్ల కోసం పంజాబ్లోని పటియాలాలో రెండో గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్ను (జీఎన్సీ) ఎస్బీఐ ప్రారంభించింది.
- న్యాయవాద సమాజానికి మరింతగా సేవలందించేందుకు హైకోర్టు శాఖలను రీడిజైన్ చేసే కార్యక్రమానికి ఎస్బీఐ శ్రీకారం చుట్టింది.
- గృహ రుణాల మంజూరు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చినట్లు ఎస్బీఐ తెలిపింది. రుణ దరఖాస్తు ప్రక్రియ ఏయే దశల్లో ఉందనే విషయాన్ని ఎస్ఎమ్ఎస్లు, మెయిల్ ద్వారా రుణ గ్రహీతలకు తెలియజేస్తున్నామని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదానీ గ్రూప్పై నివేదిక 2 నెలల ముందే కింగ్డన్ చేతికి
అదానీ గ్రూప్పై అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా రూపొందించిన నివేదికను ప్రచురించడానికి రెండు నెలల ముందే, -
ప్రీమియం ఎకానమీ సీట్లతో ఎయిరిండియా కొత్త విమానం
ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానమైన ఎ320 నియో, ఎయిరిండియాకు చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, -
సానుకూలతలకు అవకాశం
రాబోయే బడ్జెట్పై ఆశావహ దృక్పథంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలు వృద్ధిరేటు పెంచేందుకు దోహదం చేసేలా ఉంటాయనే అంచనాలున్నాయి. -
పసిడి-వెండి రాణింపు
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలించొచ్చు. అమెరికా ఉద్యోగ గణాంకాలకు తోడు డాలర్ బలహీనపడే వీలుండటం ఇందుకు నేపథ్యం. బంగారం కాంట్రాక్టుకు రూ.73,666 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
78500-78900 ఎగువన లాభాలే!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే గణాంకాలకు తోడు బడ్జెట్పై అంచనాలు మెరుగవ్వడం, రుతుపవనాలు పుంజుకోవడం కలిసొచ్చాయి. -
అపోలో హెల్త్లో అపోలో హాస్పిటల్స్కు మరింత వాటా
అనుబంధ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్లో రూ.103.2 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఈ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. -
పీ అండ్ ఎస్ బ్యాంక్ 100 కొత్త శాఖలు
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 100 శాఖలను తెరిచే ప్రణాళికలో ఉన్నట్లు ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ (పీ అండ్ ఎస్) బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా వెల్లడించారు. -
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కట్టడికి ఏడు ప్రతిపాదనలు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ వల్ల అత్యధికులు నష్టపోతున్న నేపథ్యంలో.. చిన్న మదుపర్లను కాపాడటంతో పాటు, నియంత్రణపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు వచ్చిన 7 ప్రతిపాదనలపై సెబీ నియమించిన... -
పొదుపు ఖాతాల్లో మరిన్ని సదుపాయాలు: ఐఓబీ
రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), పొదుపు ఖాతాల (ఎస్బీ అకౌంట్)పై మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.