- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sony Bravia 7 series: సోనీలో కొత్త బ్రేవియా 7 సిరీస్ టీవీలు.. ధర, ఫీచర్లివే..!
Sony Bravia 7 series : బ్రేవియా 7 సిరీస్లో సోనీ మినీ ఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మెరుగైన ఆడియో, వీడియో ఎక్స్పీరియెన్స్ను అందించేలా వీటిని తీర్చిదిద్దింది.
Sony Bravia 7 series | ఇంటర్నెట్ డెస్క్: సోనీ ఇండియా బ్రేవియా 7 సిరీస్లో (Sony Bravia 7 series) కొత్త టీవీలను విడుదల చేసింది. కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్, మినీ ఎల్ఈడీ, ఎక్స్ఆర్ ట్రిల్యుమినోస్ ప్రో టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లతో విజువల్, ఆడియో పరంగా ఈ టీవీలను ఉన్నతంగా తీర్చిదిద్దింది.
సోనీ బ్రేవియా 7 సిరీస్ ఫీచర్లు..
సోనీ బ్రేవియా 7 సిరీస్ (Sony Bravia 7 series) టీవీలు 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల పరిమాణంలో లభిస్తున్నాయి. ఎక్స్ఆర్ కాంట్రాస్ట్ బూస్టర్, మినీ ఎల్ఈడీ ప్యానెల్తో ఇమేజ్ క్వాలిటీ పెరగనుంది. ఎక్స్ఆర్ ట్రిల్యుమినోస్ ప్రో టెక్నాలజీతో అనేక రంగులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రతి ఫొటో, వీడియో అత్యంత సహజంగా కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్స్ఆర్ క్లియర్ ఇమేజ్ టెక్ వల్ల యాక్షన్ సినిమాల్లో వేగంగా కదిలే సీన్స్ సైతం అత్యంత స్పష్టంగా కనిపిస్తాయని వివరించింది.
అకౌస్టిక్ మల్టీ-ఆడియో టెక్నాలజీ, ఎక్స్ఆర్ సౌండ్ పొజిషనింగ్తో సోనీ బ్రేవియా 7 సిరీస్ టీవీల సౌండ్ క్వాలిటీ అత్యంత నాణ్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 3డీ సరౌండ్ సౌండ్తో గొప్ప అనుభూతి లభిస్తుందని పేర్కొంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ టెక్నాలజీలతో హెచ్డీఆర్ కంటెంట్, మల్టీ డైమెన్షనల్ సౌండ్ వస్తాయని తెలిపింది.
గేమ్స్ ఆడేవాళ్లకు అనుగుణంగా బ్రేవియా 7 సిరీస్ను (Sony Bravia 7 series) ప్లేస్టేషన్ 5కు అనుసంధానించి ఆటో హెచ్డీఆర్ టోన్ మ్యాపింగ్, ఆటో లో ల్యాటెన్సీ మోడ్ వంటి ఫీచర్లను ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. గూగుల్ టీవీ కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో నాలుగు లక్షల సినిమాలు, టీవీ ఎపిసోడ్లు, 10వేల యాప్లు, గేమ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. బ్రేవియా క్యామ్ యాక్సెసరీని విడిగా కొనుగోలు చేస్తే సైగలతోనే టీవీని నియంత్రించొచ్చని.. గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్ కూడా లభిస్తుందని తెలిపింది.
బ్రేవియా 7 సిరీస్ ధర..
- 55 అంగుళాల టీవీ - రూ.1,82,990
- 65 అంగుళాల టీవీ - రూ.2,29,990
- 75 అంగుళాల టీవీ - ఇంకా వెల్లడించాల్సి ఉంది.
సోనీ రిటైల్ ఔట్లెట్లు, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
Bajaj Auto: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ సీఎన్జీతో పనిచేసే తొలి ఆటో ట్యాక్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది. -
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
Demat accounts: దేశంలో డీమ్యాట్ ఖాతాల తెరిచే వారి సంఖ్య పెరుగుతోంది. జూన్లో ఈ సంఖ్య మరో 42 లక్షలు పెరిగింది. -
పని ఒత్తిడి తట్టుకోలేక రోబో సూసైడ్?
దక్షిణ కొరియాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పని ఒత్తిడి తాళలేక ఓ రోబో సూసైడ్ చేసుకుంది! -
నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడింది. -
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. -
ఎయిర్టెల్ కస్టమర్ల డేటా లీక్?.. ఖండించిన టెలికాం సంస్థ
Airtel Data Leak: తమ కస్టమర్ల వ్యక్తిగత వివరాలు హ్యాకర్లు తస్కరించారని వస్తున్న వార్తల్ని ఎయిర్టెల్ ఖండించింది. -
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
Adani Hindenburg Row: అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వెనక చైనా హస్తం ఉందని ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 492 పాయింట్ల నష్టంతో 79,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,201 వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్లో ప్రత్యక్షం
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి