- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Digitization: చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది.
2025 కల్లా 60% ఎంఎస్ఎమ్ఈలు ఆ పనిచేస్తాయ్
వొడాఫోన్ ఐడియా నివేదిక
దిల్లీ: వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. అంతే కాదు ఇందు కోసం బడ్జెట్ను పెంచుకోవాలని 43 శాతం కంపెనీలు భావిస్తున్నాయనీ తెలిపింది. 16 పరిశ్రమల్లో 1.6 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి రూపొందించిన ఈ నివేదిక ఇంకా ఏమంటోందంటే..
- ఎంఎస్ఎమ్ఈలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివి. 6.3 కోట్లకు పైగా ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈలు 11 కోట్ల మందికి పైగా ఉపాధినిస్తున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీకి ఇవి 30 శాతం వాటాను అందిస్తున్నాయి. 2027 కల్లా ఈ వాటా 35-40 శాతానికి పెరగొచ్చని అంచనా.
- 2047 కల్లా ‘వికసిత్ భారత్’(అభివృద్ధి చెందిన భారత్) ఏర్పడడంలో కీలక పాత్ర పోషించాలన్నా, తమ వృద్ధి అవకాశాలను మరింత పెంచుకోవాలంటే ఎంఎస్ఎమ్ఈలు డిజిటల్లోకి తప్పక మారాల్సిన అవసరం ఉంది.
- 2024-25 కల్లా తమ వ్యాపారాన్ని డిజిటైజ్ చేయడానికి 59 శాతం ఎంఎస్ఎమ్ఈలు మొగ్గుచూపుతున్నాయి. పనిప్రదేశంలో వాతావరణాన్ని మెరుగుపరచాలని 29% కంపెనీలు, వినియోగదార్లతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవాలని 12% సంస్థలు భావిస్తున్నాయి.
- 2025 కల్లా తమ మొత్తం డిజిటలైజేషన్ బడ్జెట్ను పెంచుకోవాలని 43% ఎంఎస్ఎమ్ఈలు భావిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ మెచూరిటీ ఇండెక్స్(డీఎమ్ఐ) తక్కువగా ఉన్న రంగాలు ఇందుకు పెట్టుబడులు పెంచుకోవాలని అనుకుంటున్నాయి. ప్రస్తుతం ఐటీ-ఐటీఈఎస్, ఆర్థిక, రవాణా.. అగ్రగామి డీఎమ్ఐ రంగాలుగా ఉన్నాయి.
- డిజిటలైజేషన్ పెరిగితే టర్నోవరు పెరుగుతుంది. అలాగే కంపెనీ పరిమాణం పెరిగేకొద్దీ డీఎమ్ఎల్ తగే అవకాశం ఉంది. అందు వల్ల మధ్య నుంచి పెద్ద కంపెనీలు డిజిటైజేషన్పై ఎక్కువ మొగ్గుచూపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.