- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock market: సూచీల రికార్డుల పరుగు.. సెన్సెక్స్@ 79000.. నిఫ్టీ@ 24000
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 568 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో ముగిశాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీల ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకొని సరికొత్త రికార్డులను తిరగరాశాయి. వరుసగా కొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పుతూ వస్తున్న సూచీలు.. మరో కీలక మైలురాయిని అధిగమించాయి. సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, ఐటీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు దీనికి కారణం.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ ఉదయం 78,758.67 వద్ద ప్రారంభమైంది. ఆరంభంలో నష్టాల్లో కదలాడిన సూచీలు.. తర్వాత పుంజుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడేలో 79396.03 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 24 వేల మైలురాయిని దాటి 24,087.45 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సెన్సెక్స్ జూన్ 25న 78 వేల మైలురాయిని అందుకోగా.. నిఫ్టీ 23 సెషన్లలోనే 23 వేల స్థాయి నుంచి 24 వేల స్థాయికి చేరుకుంది.
సెన్సెక్స్ చివరికి 568.93 పాయింట్ల లాభంతో 79,243.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 175.70 పాయింట్ల లాభంతో 24,044.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎల్అండ్టీ, సన్ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85.57 డాలర్లు, బంగారం ఔన్సు 2323 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది.
- భారత సిమెంట్ తయారీ పరిశ్రమలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా సిమెంట్స్ లిమిటెడ్లో 23 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు విలువ గురువారం రూ.606.75 (5.45 శాతం) లాభపడి రూ.11,749 వద్ద ముగిసింది. ఇండియా సిమెంట్స్ షేరు సైతం రూ.29.13 (11.09 శాతం) లాభంతో రూ.291.75 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
Credit card rules: క్రెడిట్ కార్డులకు సంబంధించి బ్యాంకులు కొన్ని మార్పులు చేశాయి. జులై నుంచే ఆ మార్పులు అమల్లోకి రానున్నాయి. -
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నడిపిస్తోన్న ఈశా అంబానీ(Isha Ambani).. తన కవలలకు ఐవీఎఫ్(IVF) పద్ధతిలో జన్మనిచ్చినట్లు తెలిపారు. -
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. -
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
Anant Ambani-Radhika Merchant wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. జులై 2న ఈ కార్యక్రమం జరగనుంది. -
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
-
ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
-
వైవీయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం
-
సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్.. అనుమతించిన కోర్టు
-
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు