- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock market: రెండో రోజూ అదే దూకుడు.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 620, నిఫ్టీ 147 పాయింట్ల మేర లాభాల్లో ముగిశాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి రాణించాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సూచీలు మరోసారి జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78759.4 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,889.90 పాయింట్ల వద్ద ఆల్టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ ఉదయం 78,094.02 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. చివరికి 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 147.50 పాయింట్ల లాభంతో 23,868.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.58గా ఉంది. సెన్సెక్స్లో రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ చమురు ధర 85.72 డాలర్ల వద్ద, ఔన్సు బంగారం 2326 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- జునిపర్ గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ఒప్పందాలు: గుజరాత్, రాజస్థాన్లలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి రెండు వేర్వేరు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సంతకం చేసినట్లు జునిపర్ గ్రీన్ ఎనర్జీ బుధవారం తెలిపింది. గుజరాత్లో 90 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ కోసం విండ్ ఫేజ్ VI కింద గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (GUVNL)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి దాదాపు 29.30 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. అలాగే, గుజరాత్, రాజస్థాన్లలో 150 మెగావాట్ల విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం హైబ్రిడ్ ట్రాంచ్ VII కింద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI)తో కంపెనీ మరో PPA (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్)పై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి దాదాపు 47.70 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
Jio Safe- Jio Translate: రిలయన్స్ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్, రెండోది జియో ట్రాన్స్లేట్. -
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఛైర్మెన్గా.. బ్యాంక్ ప్రస్తుత డైరెక్టర్లలో ఒకరైన శ్రీనివాసులు శెట్టిని నియమించాలని ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించింది. -
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
Credit card rules: క్రెడిట్ కార్డులకు సంబంధించి బ్యాంకులు కొన్ని మార్పులు చేశాయి. జులై నుంచే ఆ మార్పులు అమల్లోకి రానున్నాయి. -
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నడిపిస్తోన్న ఈశా అంబానీ(Isha Ambani).. తన కవలలకు ఐవీఎఫ్(IVF) పద్ధతిలో జన్మనిచ్చినట్లు తెలిపారు. -
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. -
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
Anant Ambani-Radhika Merchant wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. జులై 2న ఈ కార్యక్రమం జరగనుంది. -
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన కోహ్లీ, అక్షర్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 177
-
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం