Stock market: కొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 443, నిఫ్టీ 131 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

Published : 01 Jul 2024 16:03 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి లాభాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, పైనాన్షియల్‌ షేర్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. ఈ క్రమంలోనే సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 79,043.35 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,561 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవనకాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో  ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది.

సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.25 డాలర్లు, బంగారం ఔన్సు 2,338 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని