- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock market: కొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 443, నిఫ్టీ 131 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి లాభాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, పైనాన్షియల్ షేర్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. ఈ క్రమంలోనే సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి.
ఉదయం సెన్సెక్స్ 79,043.35 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. తర్వాత ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,561 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవనకాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది.
సెన్సెక్స్లో టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్అండ్టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85.25 డాలర్లు, బంగారం ఔన్సు 2,338 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి.. ఆరంభ లాభాలు ఆవిరి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 34, నిఫ్టీ 18 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా
BSNL: ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ టారిఫ్లను పెంచిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్లోని రూ.249 ప్లాన్ ఇప్పుడు ట్రెండవుతోంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలేంటో చూద్దాం. -
రోజులో ఆ టైమ్ నాకు ఇంపార్టెంట్: దినచర్య గురించి జెఫ్ బెజోస్ ఏం చెప్పారంటే?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన దినచర్యను ఎలా ప్రారంభిస్తారో వెల్లడించారు. ఉదయం ఏమేమీ చేస్తారో చెప్పారు. -
ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే!
Amazon Prime Day Sale: అమెజాన్ సంస్థ కొత్త సేల్ను ప్రకటించింది. ఈ నెలలోనే ప్రైమ్ డే సేల్ పేరుతో ముందుకు రానుంది. -
అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!
Adani Hindenburg Row: అదానీ హిండెన్బర్గ్ వివాదంలోకి తాజాగా కోటక్ బ్యాంకు కూడా వచ్చి చేరింది. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ.. హిండెన్బర్గ్ తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది. -
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?
RBI Floating Rate Savings Bonds | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఇందులో పెట్టుబడి చేయాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,150 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 79,601 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకొని 24,189 దగ్గర కొనసాగుతోంది. -
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
-
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
-
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!